22రోజులు ఏకదాటిగా కంప్యూటర్ గేమ్: టీనేజర్ మృతి
మాస్కో: ఇంటర్నెట్లో ఆటకు బానిసైన ఓ యువకుడు 22 రోజుల పాటు అలాగే ఆడాడు. దీంతో, అతను ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. రష్యాలోని యుచల్లి పట్టణానికి చెందిన పదిహేడేళ్ల రుస్తంకు ఓ ప్రమాదంలో కాలు విరిగిపోయింది. దీంతో అతను ఇంటిపట్టునే ఉండవలసి వచ్చింది.
చికిత్స అనంతరం, ఆగస్టు 8న ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకు వచ్చారు. అతనిని తల్లిదండ్రులు ఓ గదిలో ఉచారు. అతనికి వైద్యులు విశ్రాంతి కావాలని చెప్పారు. దీంతో, అతనికి కావాల్సినవి అన్నీ గదిలోనే తల్లిదండ్రులు ఉంచారు. కంప్యూటర్ కూడా ఏర్పాటు చేశారు.

దీంతో, అతను ఆ గదిలో నిత్యం కంప్యూటర్లో గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. 22 రోజుల పాటు అలాగే నిరంతరంగా ఆడాడు. ఎటూ కదలకుండా ఉండటంతో రక్తం గడ్డకట్టే వ్యాధఇ రెండో దశకు చేరుకోవడంతో యువకుడు మృతి చెంది ఉంటాడని వైద్యులు చెప్పారు.
అతని గది నుంచి నిత్యం కీ బోర్డు శబ్దం వచ్చింది. ఆగస్టు 30వ తేదీన అది ఆగిపోయింది. దీంతో తల్లిదండ్రులు లోపలకు వెళ్లి చూసి, అతనిని ఆసుపత్రికి తరలించారు. ఒకే ఆటకు బానిసగా మారిన రుస్తం.. గత ఏడాదిన్నర కాలంలో రెండువేల కన్నా ఎక్కువ గంటలు ఆట ఆడాడు. అతను పురాతన యుగానికి చెందిన యుద్ధ ఆటను ఆడుతూ గడిపాడు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications