22రోజులు ఏకదాటిగా కంప్యూటర్ గేమ్: టీనేజర్ మృతి
మాస్కో: ఇంటర్నెట్లో ఆటకు బానిసైన ఓ యువకుడు 22 రోజుల పాటు అలాగే ఆడాడు. దీంతో, అతను ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. రష్యాలోని యుచల్లి పట్టణానికి చెందిన పదిహేడేళ్ల రుస్తంకు ఓ ప్రమాదంలో కాలు విరిగిపోయింది. దీంతో అతను ఇంటిపట్టునే ఉండవలసి వచ్చింది.
చికిత్స అనంతరం, ఆగస్టు 8న ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకు వచ్చారు. అతనిని తల్లిదండ్రులు ఓ గదిలో ఉచారు. అతనికి వైద్యులు విశ్రాంతి కావాలని చెప్పారు. దీంతో, అతనికి కావాల్సినవి అన్నీ గదిలోనే తల్లిదండ్రులు ఉంచారు. కంప్యూటర్ కూడా ఏర్పాటు చేశారు.

దీంతో, అతను ఆ గదిలో నిత్యం కంప్యూటర్లో గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. 22 రోజుల పాటు అలాగే నిరంతరంగా ఆడాడు. ఎటూ కదలకుండా ఉండటంతో రక్తం గడ్డకట్టే వ్యాధఇ రెండో దశకు చేరుకోవడంతో యువకుడు మృతి చెంది ఉంటాడని వైద్యులు చెప్పారు.
అతని గది నుంచి నిత్యం కీ బోర్డు శబ్దం వచ్చింది. ఆగస్టు 30వ తేదీన అది ఆగిపోయింది. దీంతో తల్లిదండ్రులు లోపలకు వెళ్లి చూసి, అతనిని ఆసుపత్రికి తరలించారు. ఒకే ఆటకు బానిసగా మారిన రుస్తం.. గత ఏడాదిన్నర కాలంలో రెండువేల కన్నా ఎక్కువ గంటలు ఆట ఆడాడు. అతను పురాతన యుగానికి చెందిన యుద్ధ ఆటను ఆడుతూ గడిపాడు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications