కేంద్రమంత్రినే పంపించి, సారీ చెప్పించిన మహిళ!
పాట్నా: రెండు రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్లో సమాజ్ వాది పార్టీ నేతకు ఓ మహిళ షాకిచ్చిన విషయం మరవకముందే... తాజాగా బీహార్లో ఓ కేంద్రమంత్రిని మహిళా కానిస్టేబుల్ ఝలక్ అడ్డుకున్నారు. పాట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బయటకు వెళ్లే మార్గం నుండి కేంద్రమంత్రి లోపలకు వెళ్తుంటే.. మహిళా కానిస్టేబుల్ అడ్డుకున్నారు.
అడ్డదిడ్డంగా విమానాశ్రయంలోకి ప్రవేశిస్తున్న కేంద్రమంత్రి వాహనాన్ని అడ్డుకొని, బయటకు దారి చూపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రామ్ కృపాల్ యాదవ్ మంగళవారం విమానాశ్రయానికి కాన్వాయ్లో వచ్చారు.

బయటకు వెళ్లే మార్గం గుండా లోపలకు పోతుండటాన్ని డ్యూటీలో ఉన్న మహిళా అధికారి గమనించారు. కేంద్రమంత్రి కారులో ఉన్నారని చెప్పినా వినకుండా కాన్వాయ్ను అడ్డుకొన్నారు.
ఇంతలో మీడియా ప్రతినిధులు మూగడంతో కొద్దిసేపు ఎదురుచూసి... కేంద్రమంత్రి వెనక్కి వెళ్లారు. దీనిపై కేంద్రమంత్రి తన తప్పును కూడా అంగీకరించారు. సదరు మహిళా కానిస్టేబుల్ను మెచ్చుకున్నారు.
తాను చేసింది తప్పేనని, కాకపోతే ఏదో తొందరలో అలా చేయాల్సి వచ్చిందని సదరు కేంద్రమంత్రి రామ్ కృపాల్ యాదవ్ అంగీకరించారు. కేంద్రమంత్రి దత్తాత్రేయకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వచ్చినట్లు ఆయన చెప్పారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications