సీఎం సెక్యూరిటీ ఆఫీసులో కుక్కల హల్చల్
బేగంపేటలోని తెలంగాణ ముఖ్యమంత్రి సెక్యూరిటీ క్వార్టర్స్లోకి ప్రవేశించిన వీధి కుక్కలు హల్చల్ చేస్తున్నాయి.
హైదరాబాద్: నగరంలో కుక్కల బెడద ఎంత ఉందో ఇక్కడ నివసిస్తున్న ప్రతీ సామాన్యుడికి తెలుసు. గతంలో పలుమార్లు పిల్లలు, పెద్దలపై దాడి చేసిన కుక్కలు.. వారిని ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేశాయి. బాధితుల ఫిర్యాదుతో తాత్కాలిక చర్యలు తీసుకున్నా.. శాశ్వత పరిష్కారం మాత్రం లభించలేదు.
సామాన్యుల బాధలు ఇలావుంటే ఏకంగా బేగంపేటలోని తెలంగాణ ముఖ్యమంత్రి సెక్యూరిటీ క్వార్టర్స్లోకి ప్రవేశించిన వీధి కుక్కలు హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఇంటికి పక్కనే ఉన్న మంజీరా గెస్ట్ హౌజ్ గేటు దూకి సీఎం సెక్యూరిటీ క్వార్టర్స్లోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో అక్కడివారు కూడా భయాందోళనకు గురవుతున్నారు.

కుక్కల బెడదతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఐదు డాగ్ స్క్వాడ్స్, ఓ క్యాచింగ్ యూనిట్తో ఆ కుక్కలను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. బుధవారం వరకు కూడా ఆ కుక్కల జాడ తెలియలేదని, వాటి కోసం గాలిస్తున్నట్లు జీహెచ్ఎంసీ బేగంపేట వెటర్నరీ ఆఫీసర్ తెలిపారు.
పాత సెక్యూరిటీ ఫోర్సెస్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న గత సీఎం క్యాంప్ ఆఫీసులోనే 9ఎకరాల్లో సువిశాలమైన భవనాన్ని నిర్మించగా.. ముఖ్యమంత్రి ఇటీవల గృహ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే.
కాగా, ప్రధానంగా మంజీరా గెస్ట్ హౌజ్ గేట్ నుంచే ఈ వీధి కుక్కలు సెక్యూరిటీ క్వార్టర్స్లోకి ప్రవేశిస్తున్నాయి. ఐఏఎస్ రిక్రియేషన్ సెంటర్ శిథిలాలు, అక్కడి చెత్తాచెదారం కుప్పలుగా ఉండటంతో వీధి కుక్కలు అక్కడే ఎక్కువగా తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అటు జీహెచ్ఎంసీ, ఇటు సెక్యూరిటీ సిబ్బంది ఆ కుక్కల స్వైరవిహారానికి చెక్ పెట్టే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications