vasantha panchami 2023: వసంతపంచమి నేడే.. ఇలా చేస్తే జ్ఞానంతో పాటు ధనం, విజయం!!
నేడే వసంత పంచమి. వసంత పంచమి నాడు సరస్వతీ అమ్మవారిని ఈ విధంగా పూజిస్తే జ్ఞానంతో పాటు ధనం, విజయం కూడా మీ సొంతం అవుతుంది.
జనవరి 26వ తేదీన నేడు వసంత పంచమిని అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. వసంత పంచమి పర్వదినం మనలో విజ్ఞానానికి, కళలకు, జ్ఞానానికి ప్రతీకైన హిందూ దేవత సరస్వతి దేవికి అంకితం చేయబడింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వసంత పంచమిని శ్రీ పంచమి అని అలాగే సరస్వతి పూజ అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన పర్వదినాలలో సరస్వతి పూజ కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.

వసంత పంచమి ప్రత్యేకత ఇదే
వసంత పంచమి సరస్వతి దేవి పుట్టినరోజుగా జరుపుతారు. అందుకే వసంత పంచమి రోజున సరస్వతి జయంతిగా కూడా పిలుస్తారు. మనం దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించి ఏ విధంగా అయితే లక్ష్మీదేవి కటాక్షం కోసం చూస్తామో ... దేవి శరన్నవరాత్రులలో దుర్గాదేవిని పూజించి, దుర్గామాత కటాక్షం కోసం ఎదురుచూస్తామో, అదేవిధంగా సరస్వతి దేవి కోసం వసంత పంచమి రోజు పూజించి ప్రతి ఒక్కరిలో జ్ఞాన దీప్తిని వెలిగించాలని ప్రార్థిస్తాము.

వసంత పంచమి నాడు చెయ్యాల్సిన పూజలు ఇవే
సరస్వతి దేవిని తెల్లటి వస్త్రాలతో మధ్యాహ్నం కి ముందు అంటే పూర్వాహ్న సమయంలో పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. తెలుపు రంగు సరస్వతీదేవికి ఇష్టమైన రంగు కావడంతో, తెలుపు రంగు బట్టలతో, తెల్లటి పువ్వులతో సరస్వతి దేవిని అలంకరించి పాలు తెల్ల నువ్వులతో చేసిన పదార్థాలను సరస్వతి దేవికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారిని పూజిస్తారు. వసంత పంచమి రోజున చాలామంది అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆరోజే విద్యకు ఆరంభంగా తమ చిన్నారుల తోటి అక్షరభ్యాసాన్ని చేయిస్తారు.

వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజిస్తే విజయం, ధనం
సరస్వతి ఆలయాలలోనూ, చాలా పాఠశాలల్లో నేడు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. ఋతువులలో వసంత రుతువులో వచ్చే ఈ పండుగను వసంత పంచమి గా జరుపుకోవాలని గమనార్హం. ఇక వసంత పంచమి నాడు సరస్వతి దేవిని ఏ విధంగా పూజిస్తే విజయం సిద్ధిస్తుంది. ధనం లభిస్తుంది వంటి వివరాలను తెలుసుకుంటే.. వసంత పంచమి నాడు సరస్వతి దేవిని ఎర్రటి పువ్వులతో పూజిస్తే మంచిదని చెబుతున్నారు. ఇది విజయాన్ని చేకూరుస్తుందని చెబుతున్నారు.

వసంత పంచమి నాడు ఈ పనులు చెయ్యండి.. అన్నింటా లాభమే
అంతేకాదు వసంత పంచమి నాడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా చూసుకొని ఇల్లంత శుభ్రం చేసుకుని సరస్వతి దేవికి పూజ చేసి ఆ తల్లిని ప్రార్థించుకోవడం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుందని సూచిస్తున్నారు. విద్యార్థులు చదువుల ముందు ఉండాలంటే సరస్వతి దేవి విగ్రహాన్ని స్టడీ టేబుల్ మీద పెట్టుకోవడం మంచిదని, విద్య పై ఏకాగ్రత పెరిగేలా సరస్వతి దేవి చేస్తుందని తద్వారా జ్ఞానం లభిస్తుందని చెబుతున్నారు. ఎవరైనా వసంత పంచమి నాడు భక్తిశ్రద్ధలతో సరస్వతి దేవిని పూజిస్తే ధనం, ఆరోగ్యం మాత్రమే కాకుండా విజయం కూడా సొంతమవుతుందని చెబుతున్నారు.
Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
ధనుస్సు రాశి వార్షిక ఫలం.. వీరికి గృహయోగం.. కానీ ఈ విషయాల్లో జాగ్రత్త! -
100 శాతం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా కలిసిరాకపోతే అందుకు ఒకటే కారణం -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
రేపటి నుండి బుధుడి ప్రత్యక్ష సంచారంతో కుంభరాశితో సహా వీరు శ్రీమంతులు అవుతారు -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!!











Click it and Unblock the Notifications