ఇటు ఎక్స్ ప్రెస్ వే: అటు గ్రేటర్ ఎన్నికలు
హైదరాబాదులోని మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు అత్యంత పొడవైన ఈ ఎక్స్ ప్రెస్ వేను నిర్మించారు. నిజానికి, 2008లోనే ఇది ప్రారంభం కావాల్సి ఉంది. దీని నిర్మాణంలో పది నెలల జాప్యం జరిగింది. దీనికి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టాలనే ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. అయితే మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరును దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి దానికి ఖరారు చేశారు. దీంతో అదే పేరును కొనసాగించాలని రోశయ్య ప్రభుత్వం నిర్ణయించింది. 2000 మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి దీనికి పునాది రాయి వేశారు. ఇది ఫోర్ వే ఎక్స్ ప్రెస్ వే. నాలుగు చక్రాల వాహనాలను మాత్రమే దీనిపై అనుమతిస్తారు.
ఇటు ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం కాగానే అటు ఎన్నికల కమిషనర్ ఎవియస్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. నవంబర్ 12వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి.