వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ ఎంపీలపై సోనియా ఆగ్రహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: పార్లమెంటుకు గైర్హాజరైన పార్లమెంటు సభ్యులపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో పార్టీ సభ్యులు లోకసభలో తక్కువగా ఉండడంపై ఆమె మండిపడినట్లు సమాచారం. గైర్హాజరైన పార్లమెంటు సభ్యులు జాబితా ఇవ్వాలని ఆమె ఆదేశించినట్లు, గైర్హాజరుకు వివరణ ఇవ్వాలని ఎంపీలకు సూచించినట్లు చెబుతున్నారు.

సోమవారం ప్రశ్నలు వేయడానికి 34 మంది సభ్యులు పేర్లు ఇచ్చారు. లోకసభ స్పీకర్ మీరా కుమార్ పిలిచినప్పుడు వారెవరూ లేరు. వారిలో వరుణ్ గాంధీ (బిజెపి), మధు యాష్కీ, శ్రుతి చౌదరి (కాంగ్రెసు), శివాజీ అండాళ్రావు పాటిల్ (శివసేన), రాజీవ్ రంజన్ దాస్ (జెడి-యు), ప్రబోధ్ పాండా (సిపిఐ) గైర్హాజరైన వారిలో ఉన్నారు. సభ్యులెవరూ లేకపోవడంతో అసంతృప్తి చెందిన మీరా కుమార్ అసంతృప్తికి గురై సభను వాయిదా వేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X