హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్యతో శ్రీకృష్ణ కమిటీ సభ్యుల భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై అధ్యయనానికి కేంద్రం వేసిన శ్రీకృష్ణ కమిటీ సభ్యులు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కె రోశయ్యతో భేటీ అయ్యారు. రోశయ్యతో వారు దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ తర్వాత శాసనసభ ఆవరణ పక్కన గల జూబిలీ హాల్ ను పరిశీలించారు. అభిప్రాయ సేకరణకు, సమావేశాల నిర్వహణకు ఈ భవనాన్ని వాడుకోవడంపై వారు పరిశీలన జరిపినట్లు సమాచారం. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరిష్ కుమార్ తో కూడా వారు సమావేశమయ్యారు.

అభిప్రాయ సేకరణ కోసం తమకు కావాల్సిన అవసరాలపై కమిటీ సభ్యులు ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు తెలుస్తోంది. నోడల్ అధికారి రాజీవ్ శర్మతో కూడా వారు మాట్లాడారు. తెలుగులో, ఇతర ప్రాంతీయ భాషల్లో ప్రజలు వెల్లడించే అభిప్రాయాలను ఆంగ్లంలో, హిందీలో అనువాదం చేసి వివరించడానికి తగిన వ్యక్తులు కావాలని వారు రోశయ్యను అడిగినట్లు తెలుస్తోంది.

శ్రీకృష్ణ కమిటీ సభ్యులు గురువారం హైదరాబాదు చేరుకున్నారు. గురువారం సాయంత్రం వారు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మర్యాదపూర్వకంగా మాట్లాడారు. శుక్రవారం కొంత మంది కాంగ్రెసు నాయకులు శ్రీకృష్ణ కమిటీ సభ్యులను కలిసే అవకాశం ఉంది. జానారెడ్డి లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీకృష్ణ కమిటీ సభ్యులను కలుస్తారని అంటున్నారు. వారు ఈ సాయంత్రం ఢిల్లీ తిరిగి వెళ్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X