నిజంగానే మావోల చెర నుంచి వినీల్ కృష్ణ విడుదలయ్యారు
మావోయిస్టులు గురువారం మధ్యాహ్నం కుడుములగుమ్మ బ్లాక్ పరిధిలోని బొడపాడు, సప్పర్లమెట్ట, రాళ్లగెడ్డ మూడు పంచాయతీలకు చెందిన సుమారు వేయి మంది ఆదివాసీ గిరిజనుల సమక్షంలో మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సుమారు 40 మంది మావోయిస్టులు హాజరయ్యారు. విప్లవ గీతాలతో ప్రారంభమై, అనంతరం బహిరంగసభ జరిగింది. ఈ ప్రాంతంలో అణగారుతున్న ఆదివాసీల బతుకులను సరిదిద్దడానికి అంతా ప్రయత్నించాలని మావోయిస్టు నాయకులు సూచించారు. మల్కనగిరి జిల్లా కలెక్టర్ వినీల్కృష్ణ మాట్లాడుతూ మావోయిస్టుల చెరలో ఉన్న తొమ్మిది రోజులలో తనను చాలా అభిమానంగా చూసుకున్నారన్నారు. వసతి, భోజన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ కంటికి రెప్పలా చూసుకున్నారని తెలిపారు. తన విడుదలకు ఆదివాసీలు చేసిన కృషి మరువలేనిదన్నారు. ''ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా, పేద ప్రజల అభ్యున్నతికి, వారి అభివృద్ధికి పాటుపడతాను, ఇదే నా సంకల్పం'' అని వినీల్ ప్రకటించారు. అనంతరం మావోయిస్టులు ఆ ప్రాంత గిరిజనులకు కలెక్టర్ను అప్పగించారు.
వారు అక్కడ నుంచి ద్విచక్ర వాహనంపై జనతాబాయి గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి మర పడవలో జనతాబాయి ఘాట్కు తీసుకువెళ్లి తొమ్మిది రోజులుగా కలెక్టర్ కోసం ఎదురు చూస్తున్న డ్రైవరు శంకరరావు, అధికారులకు కలెక్టర్ను అప్పగించారు. ఇంటివద్ద విలేకరులతో మాట్లాడిన వినీల్కృష్ణ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.