నిజంగానే మావోల చెర నుంచి వినీల్ కృష్ణ విడుదలయ్యారు

మావోయిస్టులు గురువారం మధ్యాహ్నం కుడుములగుమ్మ బ్లాక్ పరిధిలోని బొడపాడు, సప్పర్లమెట్ట, రాళ్లగెడ్డ మూడు పంచాయతీలకు చెందిన సుమారు వేయి మంది ఆదివాసీ గిరిజనుల సమక్షంలో మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సుమారు 40 మంది మావోయిస్టులు హాజరయ్యారు. విప్లవ గీతాలతో ప్రారంభమై, అనంతరం బహిరంగసభ జరిగింది. ఈ ప్రాంతంలో అణగారుతున్న ఆదివాసీల బతుకులను సరిదిద్దడానికి అంతా ప్రయత్నించాలని మావోయిస్టు నాయకులు సూచించారు. మల్కనగిరి జిల్లా కలెక్టర్ వినీల్కృష్ణ మాట్లాడుతూ మావోయిస్టుల చెరలో ఉన్న తొమ్మిది రోజులలో తనను చాలా అభిమానంగా చూసుకున్నారన్నారు. వసతి, భోజన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ కంటికి రెప్పలా చూసుకున్నారని తెలిపారు. తన విడుదలకు ఆదివాసీలు చేసిన కృషి మరువలేనిదన్నారు. ''ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా, పేద ప్రజల అభ్యున్నతికి, వారి అభివృద్ధికి పాటుపడతాను, ఇదే నా సంకల్పం'' అని వినీల్ ప్రకటించారు. అనంతరం మావోయిస్టులు ఆ ప్రాంత గిరిజనులకు కలెక్టర్ను అప్పగించారు.
వారు అక్కడ నుంచి ద్విచక్ర వాహనంపై జనతాబాయి గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడ నుంచి మర పడవలో జనతాబాయి ఘాట్కు తీసుకువెళ్లి తొమ్మిది రోజులుగా కలెక్టర్ కోసం ఎదురు చూస్తున్న డ్రైవరు శంకరరావు, అధికారులకు కలెక్టర్ను అప్పగించారు. ఇంటివద్ద విలేకరులతో మాట్లాడిన వినీల్కృష్ణ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications