కడప కాంగ్రెసు ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైయస్ వివేకానా, వరదరాజులు రెడ్డియా?

YS Vivekananda Reddy
న్యూఢిల్లీ: త్వరలో జరగబోయే శాసనమండలి ఎన్నికలకు కాంగ్రెసు పార్టీ తమ అభ్యర్థులను బుధవారం విడుదల చేసింది. ఏడుగురితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అయితే కడప జిల్లాపై మాత్రం ఇంకా తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. మొదట వరదరాజులు రెడ్డిని అనుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే తీవ్ర తర్జన భర్జనల అనంతరం కూడా వరదరారాజులు రెడ్డి పేరునే గురువారం ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తరఫున స్వతంత్ర అభ్యర్థిని నిలబెట్టిన దృష్ట్యా కాంగ్రెసు పార్టీ ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

జగన్ ఎఫెక్ట్ దృష్ట్యా ఆయనను అడ్డుకునేందుకు మొదట వ్యవసాయ శాఖామంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని కూడా అనుకున్నారు. అయితే పులివెందుల ఉప ఎన్నికలలో జగన్ ఎదుర్కోవడానికి కూడా వివేకా అవసరం. ఈ దృష్ట్యా అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. కాగా కడప జిల్లాను మినహాయించి మిగిలిన ఏడుగురు పేర్లను ప్రకటించింది. అనంతపురం నుండి వేణుగోపాల్ రెడ్డి, కర్నూల్ నుండి ఎస్వీ మోహన్ రెడ్డి, ఎస్పీఎస్ నెల్లూరు నుండి వాకాటి నారాయణరెడ్డి, పశ్చిమ గోదావరి నుండి గంగాభవాని, శ్రీకాకుళం నుండి విశ్వరూప్, చిత్తూరు నుండి నరేష్ కుమార్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా నుండి గిడుగు రుద్రరాజులను అభ్యర్థులుగా రంగంలోకి దింపినట్టుగా ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+