Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెదిరింపులకు భయపడను: హజారే, మూడో రోజుకు చేరిన దీక్ష

Anna Hazare
న్యూఢిల్లీ: తనను చంపేస్తాననే బెదిరింపులకు ఎప్పుడూ భయపడేది లేదని ప్రముఖ సంఘ సంస్కర్త అన్నా హజారే గురువారం అన్నారు. తనను చంపేస్తామన్న బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. తనకు దేశం, ప్రజలు ముఖ్యమని చెప్పారు. దేశాన్ని ఏలుతున్న ప్రభుత్వాలు అవినీతితో దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. అవినీతి తదితర అంశాలపై కేంద్రంతో తాను చర్చలకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించారు.

ప్రజలు తనకు ఇచ్చిన మద్దతు శక్తిని ఇచ్చిందని అన్నారు. అవినీతి నిర్మూలనకే తాను నడుం బిగించానని చెప్పారు. అవినీతి నిర్మూలనకు ఏమైనా ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. వారం రోజుల పాటు తనకు ఏమీ కాదని చెప్పారు. తాను కొంత నీరసంగా ఉన్నప్పటికీ దీక్షను మాత్రం ఆపే ప్రసక్తి లేదన్నారు. దీక్షను కొనసాగించేందుకే నిర్ణయించుకున్నానని చెప్పారు. లోక్‌జన్‌పాల్ బిల్లుపై కేంద్రం దిగి వచ్చే వరకు దీక్షను కొనసాగిస్తానని చెప్పారు.

కాగా లోక్‌జన్‌పాల్ బిల్లు కోసం పట్టుబడుతూ అన్నా హజారే చేపట్టిన దీక్ష గురువారం మూడో రుజుకు చేరుకుంది. ఆయన కొంత నీరసంగా కనిపించారు. కేంద్ర ప్రభుత్వం ఆయనతో చర్చలు జరపడానికి సిద్ధపడింది. ఇందుకు కపిల్ సిబాల్‌ను రంగంలోకి దించింది. ఆయన స్వామి అగ్నివేష్‌తో చర్చించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+