చంద్రబాబుకు షాక్: పులివెందులలో టిడిపి రెబెల్గా రామ్ గోపాల్ రెడ్డి?

తెలుగుదేశం పార్టీ జిల్లా నేత రామ్ గోపాల్ రెడ్డి బిటెక్ రవి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత దశాబ్దంన్నరగా పులివెందులలో వైయస్ కుటుంబాన్ని ధీటుగా ఎదుర్కొంటున్న వాళ్లో సతీష్రెడ్డితో పాటు రాంగోపాల్ రెడ్డి ఉన్నారు. వైయస్పై సతీష్ రెడ్డి నాలుగుసార్లు పోటీ చేసి ఓడిపోయాడు. పార్టీకి ఆయన చేసిన సేవల దృష్ట్యా ఇటీవలె చంద్రబాబు సతీష్ రెడ్డిని ఎమ్మెల్సీగా నిలబెట్టి గెలిపించారు. అయితే ఈ ఉప ఎన్నికలలో తనకు టిక్కెట్ కేటాయించక పోవడంపై సతీష్ రెడ్డి తర్వాత పులివెందులలో వైయస్ కుటుంబాన్ని ఎదుర్కొన్న రాంగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది.
వైయస్ కుటుంబాన్ని ఎదుర్కొని పులివెందులలో టిడిపి క్యాడర్ను నిలబెట్టిన వారిలో రాంగోపాల్ రెడ్డి ఉన్నారు. పార్టీకి ఇన్ని సేవలు చేసినప్పటికీ తనను గుర్తించక పోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే తనకు టిక్కెట్ దక్కక పోవడంపై సిఎం రమేష్ను కారణంగా ఆయన చూపుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఆయన టిడిపి రెబల్ అభ్యర్థిగా పోటీలో దిగేందుకు సన్నద్దం అవుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో వైయస్ కుటుంబమ మధ్య పొరపొచ్చలు కలిసి వస్తాయనుకుంటే టిడిపిలో రెబల్ అభ్యర్థి బరిలోకి దిగడంతో ఇప్పుడు మళ్లీ పులివెందుల ఎవరి వశం అవుతుందో చూడాలి.
కాగా రెబల్గా పోటీ చేస్తున్నాని వస్తున్న ఆరోపణలను రాంగోపాల్ రెడ్డి కొట్టి పారేసినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ మాత్రం తనను విస్మరించిందని ఆయన ఆవేదన చెందారు. తాను రెబెల్గా పోటీ చేయాలని అనుకోవడం లేదని పార్టీ కార్యకర్తలు నుండి ఆ డిమాండ్ వస్తుందని అన్నారు. బిటెక్ రవి సరియైన వాడని భావించే చంద్రబాబు ఆయనను ప్రకటించారని అన్నారు. రవికి సహకరించే విషయం కాలం నిర్ణయిస్తుందని అన్నారు. కార్యకర్తల అభిప్రాయాన్ని పార్టీ పరిగణలోకి తీసుకోలేదన్నారు. అయినా సమస్యను కూర్చుని పరిష్కరించే దిశలో ఆలోచిస్తామన్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications