వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రణాళికా సంఘం తీరుపై ఎగిరి గంతేసిన కిరణ్ కుమార్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక ఖరారు విషయంలో మాంటెక్ సింగ్ అహ్లూవాలియా నేతృత్వంలోని ప్రణాళికా సంఘం వ్యవహరించిన తీరు పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక ప్రణాళికపై ప్రణాళికా సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర సమర్పించిన ప్రణాళిక కన్నా ఎక్కువ మొత్తంతో రాష్ట్ర ప్రణాళికను ఖరారు చేసింది. ప్రణాళికా సంఘం 43 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ఆర్థిక ప్రణాళికను ఖరారు చేసిందని, ఇది తాము అడిగిన దాని కన్నా 60, 70 కోట్ల రూపాయలు ఎక్కువ అని ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ప్రస్తుత ప్రణాళిక నిరుటి ఆర్థిక ప్రణాళిక కన్నా 17 శాతం ఎక్కువని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 42 వేల 915 కోట్ల రూపాయలకు ఆర్థిక ప్రణాళిక ప్రతిపాదనలను ప్రణాళికా సంఘానికి సమర్పించింది. వ్యవసాయానికి, దాని ఆధారిత పరిశ్రమలకు 3,189 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆరోగ్యశ్రీకి 925 కోట్ల రూపాయలు కేటాయించారు. ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళికా సంఘం సభ్యులతో సమావేశమై వార్షిక ప్రణాళికను ఖరారు చేయించుకున్నారు. రాష్ట్ర ప్రతిపాదనల్లో ప్రణాళికా సంఘం ఏ విధమైన కోతలు పెట్టలేదు.

English summary
Chief Minister Kiran Kumar Reddy happy with the planning commission for accepting State Government proposals of state Economic plan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X