తెలంగాణ పరువు పోతుందనే కెసిఆర్ గురించి చెప్పడం లేదు: ఎర్రబెల్లి

ఈ నెల 23 నుండి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్రలు నిర్వహిస్తామని చెప్పారు. పాదయాత్రకు చంద్రబాబును కూడా ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో జెఏసి తరఫున పోటీ చేయడానికి తాము సిద్ధమని ప్రకటించారు. అందరూ జెండాలు పక్కన పెట్టి కేవలం తెలంగాణ అజెండాతో మాత్రమే ఎన్నికలలో పోటీకి దిగాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చే వరకు ఎన్నికలకు దూరంగా ఉండటానికి కూడా తాము సిద్ధమని ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీని కేవలం కొందరు కుట్ర పూరితంగా ఉస్మానియా జెఏసిలో వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు తెలంగాణపై స్పష్టత ఉందన్నారు. చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం అయినప్పటికీ తెలంగాణపై ఒకే మాటకు కట్టుబడి ఉన్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications