హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గద్వాల పాదయాత్రపై రేపు నిర్ణయం తీసుకోనున్న జూపల్లి కృష్ణారావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jupalli Krishna Rao
హైదరాబాద్: మంత్రి డికె అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ జిల్లా గద్వాల శాసనసభా నియోజక వర్గ పరిధిలో తాను చేపట్టే పాదయాత్రపై రేపు మంగళవారం నిర్ణయం తీసుకుంటానని మంత్రి జూపల్లి కృష్ణా రావు చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులకు అల్పాహార విందు ఇచ్చిన తర్వాత ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన హక్కులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ఆయన అన్నారు. చట్టప్రకారం తనకు పాదయాత్ర చేపట్టే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలని ఆయన అన్నారు.

తన పాదయాత్రకు రక్షణ కల్పించాలని తాను ఇది వరకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి కూడా లేఖ రాస్తానని ఆయన చెప్పారు. తన లేఖకు ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వాలని ఆయన కోరారు. తన పాదయాత్రకు సహకరిస్తారో, వ్యతిరేకిస్తారో చెప్పాలని ఆయన అడిగారు. జూపల్లి కృష్ణా రావు పాదయాత్రకు కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు మద్దతు ప్రకటించారు.

తన నియోజకవర్గం గద్వాలలో మంత్రి డికె అరుణ జూపల్లి కృష్ణా రావు పాదయాత్రను అడ్డుకుంటున్నారు. తాను అడ్డుకోబోనని, స్థానికులు అడ్డుకుంటే తాను ఏమీ చేయలేనని ఓ మెలిక పెట్టారు. జూపల్లి కృష్ణా రావుపై ఆమె తాజాగా సోమవారం కూడా విమర్శలు చేశారు. పార్టీని చీల్చే ప్రయత్నాలు సరికాదని ఆమె అన్నారు. సొంత అభిప్రాయాలతోనే జూపల్లి పాదయాత్ర తలపెట్టారని ఆమె అన్నారు.

English summary
Jupalli Krishna Rao to take decision on his padayatra in Gadwal tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X