శ్రీజ భర్త, చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్ కోర్టు ముందు లొంగిపోతాడా?

జస్టిస్ జి.ఎస్.సింఘ్వీ, జస్టిస్ చంద్రమౌళి ప్రసాద్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ తీర్పునిచ్చింది. వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలూ కోరుకుంటున్న దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని శిరీష్ న్యాయవాది పలుమార్లు చేసిన అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించలేదు. చట్టం ప్రకారం సంబంధిత న్యాయస్థానమే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. కోర్టు ముందు శిరీష్ లొంగిపోవటానికి ఇచ్చిన గడువును పొడిగించాలన్న విజ్ఞప్తిని కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. 'దానివల్ల వ్యవస్థపై అవాంఛనీయమైన ఒత్తిడి పడుతుంది. మీ దగ్గర డబ్బులున్నంత మాత్రాన మీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరగవు' అని తీవ్రంగా వ్యాఖ్యానించింది.
వరకట్న నిషేధ చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ శిరీష్పై ఆరోపణలు దాఖలు చేశారని న్యాయవాది పేర్కొన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. 'వరకట్న నిషేధ చట్టం దుర్వినియోగం కావటం అన్నది పార్లమెంటు పరిధిలోని అంశం. దీనికి సంబంధించి ఇప్పటికే పలు అంశాలు పెండింగులో ఉన్నాయి. పార్లమెంటుకు సమయం ఉన్నప్పుడు వీటిని పరిశీలించాలి' అని సూచించింది. శిరీష్, శ్రీజ వివాహంపై చిరంజీవి మొదటినుంచీ అసంతృప్తితో ఉన్నారని, ఆయన ప్రమేయం మేరకే ప్రస్తుత పరిణామాలన్నీ జరుగుతున్నాయని ధర్మాసనం ఎదుట న్యాయవాది ఆరోపించారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications