వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరం మెడకు 2జి ఉచ్చు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

P Chidambaram
న్యూఢిల్లీ: 2జి స్పెక్ర్టం కుంభకోణం ఉచ్చు కేంద్రమంత్రి చిదంబరం, మాజీ టెలికాం మంత్రి కపిల్ సిబాల్‌లకూ తాకేలా కనిపిస్తోంది. యుపిఏ-1 హయాంలో 2జి కేటాయింపుల సందర్భంగా కేంద్రమంత్రిగా ఉన్న చిదంబరం రేడియో తరంగాల వేలం విషయంలో తన వైఖరిని చివరి నిమిషంలో మార్చుకోకపోతే అసలు 2జి కుంభకోణం చోటుచేసుకునేది కాదని ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. ఆర్థిక మంత్రిగా చివరి నిమిషంలో వైఖరి మార్చుకోవడం ద్వారా చిదంబరం కూడా 2జీ స్కామ్‌కు ఇతోధికంగా సాయపడ్డారన్నది ప్రధాన బిజెపి ప్రధాన ఉద్దేశ్యం. అందువల్ల 2జీ కుంభకోణంలో చిదంబరం పాత్రపైన కూడా విచారణ జరపాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. ఇందుకు వీలుగా హోం మంత్రి పదవికి చిదంబరం రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో 2జి ఉచ్చు చిదంబరానికీ చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది.

చిదంబరంతో పాటు 2జీ స్కామ్‌లో నాటి టెలికం మంత్రి కపిల్ సిబల్, అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతిల పాత్రపైన కూడా దర్యాప్తు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ గురువారం దాఖలు అయింది. సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) ఈ పిటిషన్‌ను వేసింది. 2జి లైసెన్స్‌ల కేటాయింపు ఒప్పందంలో నిబంధనలను ఉల్లంఘించిన రిలయన్స్ ఇన్ఫోకమ్ సంస్థ నుంచి రూ.650 కోట్ల జరిమానాను వసూలు చేయాల్సి ఉండగా కేవలం రూ.5 కోట్ల జరిమానాను మాత్రమే టెలికం మంత్రిగా సిబల్ వసూలు చేశారని ఈ ఎన్జీవో ఆరోపించింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థకు ప్రయోజనం చేకూర్చేందుకే సిబల్ ఇలా తన మంత్రి పదవిని దుర్వినియోగం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో సిబల్ పాత్రపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలి'' అని కోర్టును సదరు ఎన్జీవో కోరింది.

తమ ఆరోపణలకు సంబంధించిన ప్రభుత్వ పత్రాలను కోర్టుకు ఎన్జీవో నిర్వాహకులు సమర్పించారు. అంతేగాకుండా అటార్నీ జనరల్ వాహనవతి పాత్రపైన కూడా దర్యాప్తు చేయించాలంటూ కోర్టును పిటిషన్‌దారు కోరారు. యుపిఏ-1 హయాంలో సొలిసిటర్ జనరల్‌గా ఉన్న వాహనవతి 2జీ కేటాయింపుల అంశంపై నాటి కేంద్ర టెలికం మంత్రి ఎ.రాజాకు న్యాయ సలహాలు ఇచ్చిన సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించారన్నది పిటిషన్‌దారు అభియోగం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఏ మంత్రిత్వ శాఖ అయినా తనకు సంబంధించిన అంశాలపై న్యాయపరమైన సందేహాలు కలిగినప్పుడు వాటిని న్యాయశాఖకు నివేదించాలి. అలా నివేదించాక మాత్రమే సంబంధిత న్యాయాధికారులు తమ సలహాను ఆయా ప్రభుత్వ శాఖలకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రాజాకు న్యాయ సలహాలు ఇచ్చే విషయంలో వాహనవతి ఈ నిబంధనను ఖాతరు చేయలేదని అభియోగం. కాగా పిటిషన్ ఈ నెల 11న విచారణకు రానుంది.

English summary
It seems, union minister Chidambaram may crisis of 2G Spectrum scam. Main opposition BJP demanding him to resign and face enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X