హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉస్మానియాలో ఉద్రిక్తత, బాష్పవాయు ప్రయోగం

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని కోరుతూ విద్యార్థులు విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరాహార దీక్షలు ప్రారంభించారు. వారికి మద్దతుగా ఉస్మానియా నుంచి రాజభవన్ వరకు బైక్ ర్యాలీ తలపెట్టారు. బైక్ ర్యాలీని పోలీసులు ఎన్‌సిసి వద్ద గల ఉస్మానియా ద్వారం వద్ద అడ్డుకున్నారు. విద్యార్థులు వారిని ఛేదించుకుని ముందుకు సాగడానికి ప్రయత్నించారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులను తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ పరామర్శించారు. ఉస్మానియా విద్యార్థుల దీక్షకు మద్దతుగా వరంగల్లులోని కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు దీక్ష చేపట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రాజకీయ నాయకులుగా తాము వెళ్తామని నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. విద్యార్థుల దీక్షకు మద్దతు ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డిని కలిసి కోరారు.

English summary
Tension prevailed in Osmania University, as police obstruct students bike rally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X