భారీ పేలుళ్లన్నీ 13వ తేదీన్నే జరిగాయి

అదే ఏడాది సెప్టెంబర్ 13న ఢిల్లీలో ఉగ్రవాదులు ఆరు బాంబులు పేల్చారు. ఇందులో 30 మంది మృతి చెందారు. 100 మందికి పైగా గాయపడ్డారు. 2010 ఫిబ్రవరి 13న పుణేలోని బేకరీలో జరిగిన పేలుడులో 17 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. ఇక ఇప్పుడు మంగళవారం (13 తేదీ) ముంబైలోని జవేరీ బజార్, ఒపెరా హౌస్, దాదర్ ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. అన్ని సంఘటనల్లోనూ పెట్టిన బాంబులన్నీ నిమిషాల తేడాలోనే వరుసగా పేల్చారు. బాగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో, అదీ జనం ఎక్కువగా బయటికి వచ్చే సాయంత్రం సమయంలోనే ఇవన్నీ జరిగాయి.












Click it and Unblock the Notifications