వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్‌ని దోషిగా నిలబెట్టినందుకే: బోస్, కొండా సురేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pilli Subhash Chandra bose and Konda Surekha
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి ప్రాణం పోసిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డినే దోషిగా నిలిపేందుకు అధిష్టానం కుట్ర చేస్తున్నదని అందుకే తాము రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నామని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు ఆదివారం చెప్పారు. మధ్యాహ్నం వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ వర్గం నేతలు పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వైయస్‌ను నిందితుడిగా పేర్కొనడం వైయస్ అనుచరులుగా తమను బాధించిందని అన్నారు. జగన్ ఆస్తులపై సిబిఐ విచారణ దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు.

జగన్‌ను దెబ్బతీయడానికి కాంగ్రెసు పార్టీ కుట్ర చేస్తున్న కారణంగా వైయస్ అనుచరులుగా తాము పదవులకు, పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. సోమవారం ఉదయం స్పీకర్‌ను కలిసి రాజీనామాలు సమర్పిస్తామని చెప్పారు. సిబిఐ ముసుగులో వైయస్‌ను నేరస్థుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వైయస్‌ను అభిమానించే వారంతా తమతో కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాము రాజీనామాలు సమర్పించే సమయంలో మరికొందరు వస్తారని అన్నారు.

పరకాల శాసనసభ్యురాలు కొండా సురేఖ మాట్లాడాతూ తాను తెలంగాణ కోసం ఇప్పటికే రాజీనామా చేశానని మరోసారి రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. తన రాజీనామాను ఆమోదించుకుంటానని చెప్పారు.

English summary
Jagan camp MLAs Pilli Subash Chandrabose and Konda Surekha said today that they will decided to resign for Late YSR name in FIR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X