ఏడుగురు వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు వెనక్కి?

రాజీనామాలపై వస్తున్న ప్రతికూలత వల్ల కూడా వారు పునరాలోచనలో పడినట్లు సమాచారం. కాగా, ఐదుగురు శాసనసభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడినట్లు చెబుతున్నారు. అయితే, వారి షరతులకు అంగీకరించడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా లేరని తెలుస్తోంది. రాజీనామాలు చేసిన శాసనసభ్యులకు టికెట్ గ్యారంటీ ఇవ్వడానికి, ఎన్నికల ఖర్చులు భరించడానికి జగన్ హామీ ఇవ్వకపోవడమే కాకుండా సీనియర్ శాసనసభ్యులతో తప్ప జూనియర్లతో మాట్లాడడానికి కూడా జగన్ ఇష్టపడకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నట్లు చెబుతున్నారు.
కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్రను ముగించుకుని జగన్ ఈ నెల 30వ తేదీన హైదరాబాదుకు వస్తారు. అప్పుడు శాసనసభ్యులతో, సీనియర్ నాయకులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకునే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్లో సిబిఐ వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చినందుకు నిరసనగా జగన్ వర్గానికి చెందిన 26 మంది శాసనసభ్యులు రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
జగన్కు విజయమ్మ షాక్: నీ చెల్లికి, మేనల్లుడికి అన్యాయం చేశావు -
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications