సిబిఐ ముందుకు సూర్య పత్రిక అధినేత, డి శ్రీనివాస్?
అలాగే ఎమ్మార్ కేసులోనూ ఎమ్మార్లో విల్లాలు కొన్న పలువురు ప్రముఖులు సిబిఐ ముందు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ సిబిఐ ముందు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. విల్లాలు కొన్న వారిలో ఇప్పటికి పదిమందిని సిబిఐ విచారించినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు నుండి వరుసగా మిగిలిన వారిని విచారించనుంది. ఎమ్మార్లో సుమారు 80 మంది వరకు తక్కువ ధరకే విల్లాలు కొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిబిఐ నాలుగు బృందాలుగా ఒక్కో బృందంలో నలుగురు అధికారులు ఉండి విచారణ చేస్తున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న దిల్ కుష్ గెస్ట్ హౌస్లో విచారణ జరుపుతున్నారు.
కాగా సిబిఐ విచారణకు ఎమ్మార్, భారతి ఇన్ ఫ్రా, ఇంపీరియల్ కన్స్ట్రక్షన్స్, వైయస్సార్ కన్స్ట్రక్షన్స్, సరస్వతి పవర్, ఎమ్మార్ విల్లాస్ కస్టమర్స్, భారత్ ఇన్ ఫ్రా, లోటస్ ఫార్మా, సూర్యా పేపర్ ప్రతినిధులు, ఇంపీరియల్ కన్స్ట్రక్షన్స్, జొన్నలగడ్డ వెంకటేశ్వర రావు, శ్రీనివాస రావు, ఉషారాణి తదితరులు హాజరయ్యారు.