గన్మెన్ను సరెండర్ చేసిన తెలంగాణ కాంగ్రెసు ఎంపిలు

పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్, శాసనసభ్యుడు రాజయ్య పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిశారు. ముఖ్యమంత్రికి, హోం మంత్రికి చెప్పినా చలపతిరావుపై చర్యలు తీసుకోలేదని, అందుకే గన్మెన్ను వెనక్కి పంపించాలని నిర్ణయించుకున్నామని పొన్నం ప్రభాకర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమను ప్రజలే కాపాడుకుంటారని ఆయన అన్నారు. కాంగ్రెసు అధికార ప్రతినిధి రేణుకా చౌదరిపై తాము బొత్సకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రేణుకా చౌదరి అహంకారిగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. విపక్షాలను విమర్శించాల్సిన రేణుకా చౌదరి సొంత పార్టీవారినే విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. రైల్ రోకో సందర్భంగా తమపై పెట్టిన కేసుల గురించి బొత్సకు చెప్పినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications