ఎమ్మార్ కేసులో నేడు చార్జిషీట్, ఆచార్య పేరు లేకుండా

సిబిఐ 200 మందికిపైగా సాక్షులను విచారించి దాదాపు 130 పేజీల చార్జిషీట్ను సిబిఐ రూపొందించినట్లు సమాచారం. విల్లాల యజమానుల నుంచి సునీల్ రెడ్డి 70 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సిబిఐ అభియోగం మోపినట్లు సమాచారం. సునీల్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో కేసుపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మార్ ప్రాపర్టీస్కు సంబంధించి కోనేరు ప్రసాద్ 138 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడినట్లు అభియోగం మోపినట్లు సమాచారం. ఎమ్మార్లో ప్రభుత్వ వాటా తగ్గింపులో విజయ రాఘవన్ ప్రధాన పాత్ర పోషించాడని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య సిబిఐ కస్టడీ కూడా సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. తాము చార్జిషీట్ దాఖలు చేసే సమయంలోనే బిపి ఆచార్యను సిబిఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications