రెచ్చిపోయి మాట్లాడకు: కెసిఆర్కు చంద్రబాబు వార్నింగ్

చిత్తూరు జిల్లా తిరుపతిలో యువతరంగం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. బాబుకు అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున యువత తరలి వచ్చారు. కాగా పిచ్చి కూతలు కూస్తే నాలుకలు కోస్తామని కెసిఆర్ గురువారం బాబును, తెలుగదేశం తెలంగాణ ఫోరం నేతలను హెచ్చరించారు. పోలవరం టెండర్లపై న్యాయవిచారణే కాదు, అంతకన్నా ఉన్నతమైన విచారణకైనా తాను సిద్ధంగానే ఉన్నానని ఆయన అన్నారు. న్యాయవిచారణలో తమది తప్పు లేదని తేలితే హైదరాబాదులోని ఆబిడ్స్ వద్ద ముక్కు నేలకు రాసి, క్షమాపణలు చెప్పి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తావా అని ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు. తెలంగాణలో చంద్రబాబుకు బతుకే లేకుండా పోయిందని ఆయన అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు పట్టుకున్నారని, చంద్రబాబుది లఫంగా బతుకు అని, నీచమైన హేయమైన చరిత్ర చంద్రబాబుది అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications