వైయస్ విజయమ్మను తప్పు పట్టిన ఎర్రన్నాయుడు

Yerrannaidu
హైదరాబాద్: తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ అన్నిరకాలుగా పోరాడకుండానే నేరుగా కోర్టును ఆశ్రయించారని తెలుగుదేశం పార్టీ నేత ఎర్రన్నాయుడు అన్నారు. ముఖ్యమంత్రిగా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన తాము అన్నిరకాలుగా పోరాడాకే కోర్టును ఆశ్రయించామని చెప్పుకొచ్చారు. విజయమ్మ మాత్రం అలా చేయలేదన్నారు. తాము ఏ తప్పు చేయనందున భయపడాల్సిన అవసరం లేదన్నారు. మరో హైకోర్టుకు బదలీ చేయాలన్న విజయమ్మ వాదనను ఆయన తప్పు పట్టారు. వైయస్సార్ కాంగ్రెసు తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థకే కళంకం వచ్చేలా ఉందన్నారు. మాఫియా, నియంతృత్వ పోకడలు మానుకోవాలని ఆయన సూచించారు.

తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన తనయుడు లోకేష్ కుమార్‌ను ఎవరో డబ్బులివ్వడం వల్ల చదివించారనే మాటలు ఇకనైనా ఆపాలన్నారు. కావాలంటే స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి లేఖ రాసి వివరాలు తెప్పించుకోవచ్చునని, వారేమీ డబ్బుల కోసం సీట్లు అమ్ముకోరన్నారు. సాక్షి పత్రిక, ఛానల్ అవాస్తవ కథనాలు ప్రచురిస్తున్నాయన్నారు. సాక్షి కథనాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఎక్కడకు వెళ్తుందో అర్థం కావడం లేదన్నారు. వాటి తీరు రాజ్యాంగ వ్యవస్థలపై దాడి అన్నారు. జగన్ అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇలాంటి వార్తలపై న్యాయవ్యవస్థల్లో పోరాడుతామన్నారు.

వామపక్షాలతో తాము కలిసి పని చేస్తున్నామని అవి తమ పార్టీకి మిత్రపక్షాలని ఆయన పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీకి సహకరించాలని సిపిఎంను కోరుతున్నామని, అయినా పోటీ చేయాలనుకుంటే అది వారిష్టమని చెప్పారు. ఒకవేళ వారు పోటీ చేసినా ఇరు పార్టీల మధ్య సంబంధాలపై ఉప ఎన్నికల అంశం ప్రభావం చూపదని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+