అందరి కళ్లూ కోవూరుపైనే, భవిష్యత్తుకు సూచిక
అయితే, తెలుగుదేశం పార్టీ నాయకుల వాదన మరో విధంగా ఉంది. దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేస్తున్నారని, డిఎంకె, బిఎస్పీలను ప్రజలు తిరస్కరించడమే ఇందుకు ఉదాహరణ అని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిస్తే రానున్న 17 స్థానాల ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఊపు వస్తుంది. ఈ ఫలితాన్ని బట్టి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారుతుందని కూడా అంటున్నారు. ఆంధ్రప్రదేశేతర రాష్ట్రాల నాయకులు కూడా కోవూరు ఫలితాల కోసం, తెలంగాణలోని ఏడు స్థానాల ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫలితాల ప్రభావం జాతీయ స్థాయిలో ఏర్పడబోయే జాతీయ స్థాయిలో ఏర్పడబోయే తృతీయ కూటమిపై కూడా ఉంటుందని అంటున్నారు. అందుకే, తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డుతోంది.
కోవూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారవచ్చునని అంటున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు పునరాలోచనలో పడాల్సిన పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. అయితే, కోవూరు మాత్రం జగన్ రాజకీయాలకే అగ్ని పరీక్ష పెడుతుంది.