యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, ఫ్యామిలీపై కేసు

ఎమ్మెల్యే కన్నబాబు, ఆయన కుటుంబ సభ్యులు (భార్య, కుమారులు, కుమార్తె) ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని, వాటిపై విచారణ చేయాలంటూ యలమంచిలికి చెందిన ఆడారి ఆదిమూర్తి ఈనెల 11న విశాఖపట్నం ఎసిబి న్యాయస్థానంలో కేసు వేశారు. దానిని విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జివి కృష్ణయ్య అక్టోబర్ 11వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఎసిబి డీఎస్పీని ఆదేశించారు.
ఆ ఫిర్యాదును పరిశీలించిన ఎసిబి అధికారులు సోమవారం కేసు నమోదు చేశారు. కాగా, తన దగ్గర పని చేస్తున్న ఇద్దరు ఎస్సీ మహిళల పేరిట బ్యాంకుల నుంచి బస్సుల కొనుగోలుకు రుణం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు కోటి రూపాయల విలువైన రాయితీని పొందారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం దానిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
దర్యాప్తులో ఆరోపణలన్నీ వాస్తవమని తేల్చి రూ.98 లక్షలను ఎమ్మెల్యే నుంచి రికవరీ చేయాలని విజిలెన్స్ సూచించింది. అయితే, ప్రభుత్వం రికవరీ చేయకపోవడంపై యలమంచిలికి చెందిన కొయిలాడ వెంకటరావు ఇదే నెలలో హైకోర్టులో కేసు వేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఎమ్మెల్యేపై విచారణ నివేదికను సమర్పించాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించింది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications