పాక్తో ఇండియా క్రికెట్ సిరీస్పై శివమెత్తిన బాల్ థాకరే

పాకిస్తాన్తో క్రికెట్ ఆడాలనే షిండే నిర్ణయం సరైంది కాదని ఆయన అన్నారు. గతాన్ని మరిచిపోవాలని షిండే ఎలా చెబుతారని ఆయన అడిగారు. గతాన్ని ఎందుకు, ఏ విధంగా మరిచిపోవాలని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన ముంబై దాడులను, ఇతర ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రస్తావించారు.
తాను మంచం మీద పడి ఉన్నప్పటికీ షిండే ప్రకటనతో తన రక్తం ఉడికిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. కసబ్ పెట్టుకుని మెర్సీ పిటిషన్ను మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తోసిపుచ్చిందని, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ పిటిషన్ను తోసిపుచ్చాలని ఆయన అన్నారు. షిండే వంటి పరిపక్వత లేని నాయకులు ఉండడం భారతదేశం దురదృష్టమని ఆయన అన్నారు.
పాకిస్తాన్ జట్టుతో క్రికెట్ ఆడాలనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)న నిర్ణయంపై ఆయన గతవారం మండిపడ్డారు. దేశానికి అది ద్రోహం చేయడమేనని వ్యాఖ్యానించారు. డబ్బుల కోసం బిసిసిఐ ద్రోహానికి పాల్పడుతోందని, ఈ ద్రోహంలో భారత ఆటగాళ్లు కూడా పాత్రధారులని ఆయన అన్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications