మనీ లాండరింగ్పై దూకుడు: జగన్కు ఈడి నోటీసులు

జగన్ను ముగ్గురు ఈడి అధికారులు విచారించనున్నారు. ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులతో కూడిన ఈడి ప్రశ్నించనుంది. జగన్కు ఈడి నోటీసులు పంపించిన నేపథ్యంలో జగన్ ఆస్తుల జఫ్తును ఈడి మరోసారి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం జగన్ ఆడిటర్ విజయ సాయి రెడ్డిని ఈడి ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆయన నుండి పలు కీలక పత్రాలను ఈడి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కోర్టు అనుమతి తీసుకొని జగన్ ఈడి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఈడి 120 రోజుల్లో రూ.51 కోట్ల జప్తు విషయంలో ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.
కాగా విజయసాయి రెడ్డిని ఈడి సోమవారం ప్రశ్నించిన విషయం తెలిసిందే. అరగంట పాటు ఈ విచారణ సాగింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సమన్లు జారీ కావడంతో విజయసాయి రెడ్డి సోమవారం ఈడి అధికారుల ముందుకు వచ్చారు. ఈడి అధికారులు తనను విచారించడం పూర్తయిందని, తాను హైదరాబాద్ వెళ్లిపోతున్నానని విజయసాయి రెడ్డి విచారణ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఈడి అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. వాటి వివరాలను ఆయన వెల్లడించలేదు. వైయస్ జగన్ కేసులో మరో విడత ఆస్తులు జప్తు చేయడానికి ఈడి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే విజయ సాయిరెడ్డిని విచారించినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఈడి ఇప్పటికే 52 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు చేసింది. మరో విడత జప్తునకు సిద్ధమవుతూ విజయసాయి రెడ్డిని ప్రశ్నించినట్లు చెబుతున్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications