కిషోర్ చంద్రదేవ్ లేఖ చిచ్చు: మంత్రుల ముప్పేట దాడి
పవర్ ప్లాంటులలో తనకు వాటాలు ఉన్నాయని కిషోర్ చెప్పడం గర్హనీయమని శత్రుచర్ల అన్నారు. తనకు పవర్ ప్లాంటులలో ఎలాంటి వాటాలు లేవన్నారు. వాటాలు ఉన్నట్లు నిరూపిస్తే తాను ఆత్మహత్యకు సిద్ధమని, నిరూపించని పక్షంలో ఆయన కూడా అందుకు సిద్ధంగా ఉంటారా అని సవాల్ విసిరారు.
మంత్రి గంటా శ్రీనివాస రావు కూడా మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డిపై, సత్యనారాయణలపై లేనిపోని వ్యాఖ్యలు చేసిన కిషోర్ చంద్రదేవ్ పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ పై ఏ అర్హతతో లేఖ రాశారో కిషోర్ చెప్పాలని ఆయన అన్నారు. కిరణ్ సమర్ధంగా పాలన చేస్తున్నారని అన్నారు.
కాగా పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను లిక్కర్ డాన్గా, కిరణ్ కుమార్ రెడ్డిని అసమర్థుడిగా పేర్కొంటూ కిషోర్ చంద్రదేవ్ పది నెలల క్రితం సోనియాకు లేఖ రాసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాను ఎలాంటి లేఖలు రాయలేదని కిషోర్ సోమవారం ప్రకటించారు.