కసబ్ ఉరితో సరిపోదన్న మోడీ: అఫ్జల్పై బిజెపి ప్రశ్న
కసబ్ మృతిపై మన రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ నేతలు కూడా స్పందించారు. ఇంద్రసేనా రెడ్డి, విద్యాసాగర రావు, లక్ష్మణ్ తదితరులు స్పందించారు. ఆలస్యంగా అయినా కసబ్కు ఉరి సరైనదే అన్నారు. 166 మందిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు అన్నారు. ఇప్పటికే ఎప్పుడో ఈ శిక్ష అమలు చేయాల్సి ఉండెనన్నారు. కసబ్ను ఉరి తీయాల్సిందిగా భారతీయులందరూ మొదటి నుండి డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.
ప్రజల డిమాండ్ మేరకే ఉరి తీశారన్నారు. అఫ్జల్ గురు క్షమాభిక్ష దరఖాస్తు రాష్ట్రపతి వద్ద చాలా కాలంగా పెండింగులో ఉందని బిజెపి ఢిల్లీ పెద్దలు ప్రశ్నించారు. ఆ పిటిషన్ కూడా తిరస్కరించి, అతనికి కూడా త్వరగా ఉరిశిక్ష వేయాలని డిమాండ్ బిజెపి డిమాండ్ చేసింది. కసబ్ ఉరిశిక్షపై ఆర్ఎస్ఎస్, విహెచ్పి తదితర హిందూ సంస్థలతో పాటు ముస్లిం వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేశాయి.
కాగా అఫ్జల్ గురు డిసెంబర్ 13, 2001లో పార్లమెంటుపై దాడి చేశాడు. ఈ ఘటనలో పన్నెండు మంది మరణించారు. 2005లోనే అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించారు. 2011 ఆగస్టు 4 నుంచి అతని క్షమాభిక్ష పిటిషన్ పెండింగులో ఉంది. ఈ విషయంపై కసబ్ ఉరి నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ కూడా స్పందించారు. అఫ్జల్ కేసు కూడా వేగంగా పరిష్కరించాలని సూచించారు.