అఖిలేష్, ములాయంకు ఎదురుదెబ్బ: డింపుల్కు ఊరట

అక్రమాస్తుల కేసులో తనపై సిబిఐ విచారణ చేయడాన్ని ములాయం సింగ్ యాదవ్ గతంలో సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిని విచారించిన కోర్టు ఈ రోజు దానిని కొట్టి వేసింది. ములాయం సింగ్ ఆస్తుల పైన విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ కేసులో స్వతంత్ర దర్యాఫ్తు సాగించాలని సిబిఐని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసు నుండి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్కు మినహాయింపును ఇచ్చింది.
ములాయం సింగ్ మరో తనయుడు ప్రతీక్ యాదవ్ పైన కూడా విచారణను కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ములాయం సింగ్ యాదవ్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో గురువారం ఉదయం భేటీ అయ్యారు. కాగా 2007 మార్చి 1వ తేదిన సుప్రీం కోర్టు ములాయం ఆస్తుల కేసుపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ములాయం ఆస్తులపై విచారణ కొనసాగుతోంది.
సుప్రీం కోర్టు తీర్పును ములాయం సింగ్ యాదవ్ స్వాగతించారు. సిబిఐ విచారణతో తనపై వచ్చిన ఆరోపణలు తొలగిపోతాయని తాను భావిస్తున్నానని చెప్పారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications