అఖిలేష్, ములాయంకు ఎదురుదెబ్బ: డింపుల్కు ఊరట

అక్రమాస్తుల కేసులో తనపై సిబిఐ విచారణ చేయడాన్ని ములాయం సింగ్ యాదవ్ గతంలో సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిని విచారించిన కోర్టు ఈ రోజు దానిని కొట్టి వేసింది. ములాయం సింగ్ ఆస్తుల పైన విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ కేసులో స్వతంత్ర దర్యాఫ్తు సాగించాలని సిబిఐని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసు నుండి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్కు మినహాయింపును ఇచ్చింది.
ములాయం సింగ్ మరో తనయుడు ప్రతీక్ యాదవ్ పైన కూడా విచారణను కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ములాయం సింగ్ యాదవ్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో గురువారం ఉదయం భేటీ అయ్యారు. కాగా 2007 మార్చి 1వ తేదిన సుప్రీం కోర్టు ములాయం ఆస్తుల కేసుపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ములాయం ఆస్తులపై విచారణ కొనసాగుతోంది.
సుప్రీం కోర్టు తీర్పును ములాయం సింగ్ యాదవ్ స్వాగతించారు. సిబిఐ విచారణతో తనపై వచ్చిన ఆరోపణలు తొలగిపోతాయని తాను భావిస్తున్నానని చెప్పారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications