వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెట్టును ఢీకొన్న కారు: సిబిఐ జెడికి తప్పిన ముప్పు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Laxmi Narayana
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్, ఎమ్మార్ తదితర కేసులపై విచారణ జరుపుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) అదనపు సంచాలకులు(జెడి) లక్ష్మీ నారాయణకు బుధవారం ముప్పు తప్పింది. ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. అయితే ఆయన సురక్షితంగా బయటపడ్డారు.

జెడి లక్ష్మీ నారాయణతో పాటు ఆయన కుటుంబం కూడా అదే కారులో ప్రయాణిస్తోంది. జెడితో పాటు ఆయన కుటుంబం శ్రీశైలం నుండి వెళుతుండగా బ్రహ్మగిరి దగ్గర ఘాట్ రోడ్డులో వారు ప్రయాణిస్తున్న కారు ఓ చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు కొద్దిగా దెబ్బతిన్నది. అనంతరం జెడి తన కుటుంబంతో సహా కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరి వెళ్లారు.

కాగా సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ జగన్ ఆస్తుల కేసు, ఎమ్మార్ కేసు, ఓఎంసి కేసులను దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా కేసులకు సంబంధించి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలోని సిబిఐ అధికారులు ఇప్పటికి పలు ఛార్జీషీట్లు దాఖలు చేశారు. ఈ కేసులకు సంబంధించి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి తదితరులు ఇప్పటికే జైలులో ఉన్నారు.

English summary

 CBI joing director Laxmi Narayana and his family has escaped from car accident on Wednesday in Kurnool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X