వైయస్ ఆదుకున్నారు: జగన్ను కల్సిన మాజీ ఎమ్మెల్యే
జగన్ను టిడిపి, కాంగ్రెసు పార్టీలు కుట్రపూరితంగా కేసులలో ఇరికించాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు జగన్ను తప్పకుండా ముఖ్యమంత్రిగా చేస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీదే విజయమన్నారు. తాను అన్ని విధాలుగా జగన్కు మద్దతుగా నిలుస్తానని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నారని చెప్పారు.
వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలకు చేరువయ్యాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు అన్ని మద్దతు పలికినా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మద్దతివ్వకుండా మోసం చేసిందని విమర్శించారు.
బాబును నమ్మరు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత తోపుదుర్తి కవిత అనంతపురం జిల్లాలో అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని కాపాడుతూ ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. వైయస్ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారన్నారు.
విప్ ధిక్కరించిన వారిపై చర్యలు
అవిశ్వాస తీర్మానం సమయంలో విప్ ధిక్కరించిన వారిపై చర్యలుంటాయని కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు మస్తాన్ వలీ అన్నారు. గీత దాటిన ఎమ్మెల్యేల పైన స్పీకర్కు ఫిర్యాదు చేస్తామన్నారు.