మేం చెప్పలేదే: విద్యుత్ ఛార్జీలపై బొత్స వింత వాదన

రైతు శ్రేయస్సే కాంగ్రెసు పార్టీ ప్రధాన ధ్యేయం అన్నారు. విద్యుత్ ఛార్జీల భారం సామాన్యులు, రైతులపై పడకుండా ఉండే దిశలోనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సాగుతుందని తాను గట్టిగా నమ్ముతున్నానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ నేతగా విద్యుత్ ఛార్జీల భారం వేయవద్దని ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు చెప్పారు. ఛార్జీలు పెంచబోమని 2004 మేనిఫెస్టోలో తమ పార్టీ చెప్పిందన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో చెప్పలేదన్నారు.
తమ మేనిఫెస్టోలో గానీ, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కాని ఎక్కడా ఛార్జీలు పెంచమని చెప్పలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నోటికొచ్చిన అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. రైతులపై విద్యుత్ పెంపు భారం పడనీయమన్నారు. విపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆందోళనలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి మధ్య 62 మిలియన్ యూనిట్ల వ్యత్యాసం ఉందన్నారు.
సెట్ టాప్ బాక్సులపై కేంద్రానికి లేఖ
టివిలకు సెట్ టాప్ బాక్సులు పెట్టే అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ఈ నెలాఖరుతో(ఈరోజుతో) సెట్ టాప్ బాక్సులు పెట్టించుకునే గడువు తేది ముగియనుంది. ఈ నేపథ్యంలో కిరణ్ కేంద్రానికి లేఖ రాస్తూ.. మరో నెల గడువు ఇవ్వాలని కోరారు. విశాఖ, హైదరాబాద్ పట్టణాలలో మరో యాభై లక్షల మంది సెట్ టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోలేదని లేఖలో పేర్కొన్నారు.
భారం పడకుండా చూస్తాం
పేదవారిపై విద్యుత్ భారం పడకుండా చూస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విద్యుత్ సబ్సిడీ కోసం బడ్జెట్లో రూ.5700 కేటాయించామన్నారు. విద్యుత్ ఛార్జీలపై ఈఆర్సీ ఆదేశాలు పరిశీలిస్తామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలపై నాలుగు, ఐదు తేదీల్లో హైదరాబాదులో సమావేశం ఉంటుందని చెప్పారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications