మేం చెప్పలేదే: విద్యుత్ ఛార్జీలపై బొత్స వింత వాదన
రైతు శ్రేయస్సే కాంగ్రెసు పార్టీ ప్రధాన ధ్యేయం అన్నారు. విద్యుత్ ఛార్జీల భారం సామాన్యులు, రైతులపై పడకుండా ఉండే దిశలోనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సాగుతుందని తాను గట్టిగా నమ్ముతున్నానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ నేతగా విద్యుత్ ఛార్జీల భారం వేయవద్దని ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు చెప్పారు. ఛార్జీలు పెంచబోమని 2004 మేనిఫెస్టోలో తమ పార్టీ చెప్పిందన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో చెప్పలేదన్నారు.
తమ మేనిఫెస్టోలో గానీ, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కాని ఎక్కడా ఛార్జీలు పెంచమని చెప్పలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నోటికొచ్చిన అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. రైతులపై విద్యుత్ పెంపు భారం పడనీయమన్నారు. విపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆందోళనలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి మధ్య 62 మిలియన్ యూనిట్ల వ్యత్యాసం ఉందన్నారు.
సెట్ టాప్ బాక్సులపై కేంద్రానికి లేఖ
టివిలకు సెట్ టాప్ బాక్సులు పెట్టే అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ఈ నెలాఖరుతో(ఈరోజుతో) సెట్ టాప్ బాక్సులు పెట్టించుకునే గడువు తేది ముగియనుంది. ఈ నేపథ్యంలో కిరణ్ కేంద్రానికి లేఖ రాస్తూ.. మరో నెల గడువు ఇవ్వాలని కోరారు. విశాఖ, హైదరాబాద్ పట్టణాలలో మరో యాభై లక్షల మంది సెట్ టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోలేదని లేఖలో పేర్కొన్నారు.
భారం పడకుండా చూస్తాం
పేదవారిపై విద్యుత్ భారం పడకుండా చూస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విద్యుత్ సబ్సిడీ కోసం బడ్జెట్లో రూ.5700 కేటాయించామన్నారు. విద్యుత్ ఛార్జీలపై ఈఆర్సీ ఆదేశాలు పరిశీలిస్తామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలపై నాలుగు, ఐదు తేదీల్లో హైదరాబాదులో సమావేశం ఉంటుందని చెప్పారు.