జగన్కు మంచి మనసుంది: షర్మిల, పాదయాత్రలో దాడి

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మానసిక వికలాంగులకు కూడా పింఛన్ ఇచ్చారని, అదీ ఆయనకున్న గొప్ప మనసని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు కేవలం 16 లక్షల మందికి పింఛన్ ఇస్తే, వైయస్సార్ 71 లక్షల మందికి ఇచ్చారన్నారు. వికలాంగుల పట్ల ఇంకొంచెం ప్రేమ, ఆప్యాయతతో మెలగాలని, అలా చేయకపోతే మనకు, రాక్షసులకు తేడా ఉండదని వైయస్సార్ అనేవారన్నారు.
ఈ ప్రభుత్వం వైయస్ రెక్కల కష్టం మీద వచ్చిందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సింది పోయి, ఆయన పథకాలను తుంగలో తొక్కుతోందన్నారు. త్వరలోనే ప్రజలు కోరుకుంటున్నట్లుగా జగన్ వస్తాడని, వైయస్ ఎలా ఆదరించారో అలా ఆదరిస్తారన్నారు. జగన్కు వైయస్లా మంచి మనసుందన్నారు. ప్రజల గురించి జగన్ ఎప్పుడూ ఆలోచిస్తుంటారని షర్మిల అన్నారు.
మంగళవారం 190వ రోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని ఎ శరభవరం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి శృంగవరం, గాంధీనగరం, తాండవ కూడలి, ఎర్రవరం కూడలి, ములగపూడి మీదుగా బెన్నవరం చేరుకున్నారు. బెన్నవరం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. మంగళవారం మొత్తం 12.7 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,520.10 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications