జగన్కు మంచి మనసుంది: షర్మిల, పాదయాత్రలో దాడి

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మానసిక వికలాంగులకు కూడా పింఛన్ ఇచ్చారని, అదీ ఆయనకున్న గొప్ప మనసని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు కేవలం 16 లక్షల మందికి పింఛన్ ఇస్తే, వైయస్సార్ 71 లక్షల మందికి ఇచ్చారన్నారు. వికలాంగుల పట్ల ఇంకొంచెం ప్రేమ, ఆప్యాయతతో మెలగాలని, అలా చేయకపోతే మనకు, రాక్షసులకు తేడా ఉండదని వైయస్సార్ అనేవారన్నారు.
ఈ ప్రభుత్వం వైయస్ రెక్కల కష్టం మీద వచ్చిందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సింది పోయి, ఆయన పథకాలను తుంగలో తొక్కుతోందన్నారు. త్వరలోనే ప్రజలు కోరుకుంటున్నట్లుగా జగన్ వస్తాడని, వైయస్ ఎలా ఆదరించారో అలా ఆదరిస్తారన్నారు. జగన్కు వైయస్లా మంచి మనసుందన్నారు. ప్రజల గురించి జగన్ ఎప్పుడూ ఆలోచిస్తుంటారని షర్మిల అన్నారు.
మంగళవారం 190వ రోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని ఎ శరభవరం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి శృంగవరం, గాంధీనగరం, తాండవ కూడలి, ఎర్రవరం కూడలి, ములగపూడి మీదుగా బెన్నవరం చేరుకున్నారు. బెన్నవరం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. మంగళవారం మొత్తం 12.7 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,520.10 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications