జగన్కు మంచి మనసుంది: షర్మిల, పాదయాత్రలో దాడి
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మానసిక వికలాంగులకు కూడా పింఛన్ ఇచ్చారని, అదీ ఆయనకున్న గొప్ప మనసని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు కేవలం 16 లక్షల మందికి పింఛన్ ఇస్తే, వైయస్సార్ 71 లక్షల మందికి ఇచ్చారన్నారు. వికలాంగుల పట్ల ఇంకొంచెం ప్రేమ, ఆప్యాయతతో మెలగాలని, అలా చేయకపోతే మనకు, రాక్షసులకు తేడా ఉండదని వైయస్సార్ అనేవారన్నారు.
ఈ ప్రభుత్వం వైయస్ రెక్కల కష్టం మీద వచ్చిందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సింది పోయి, ఆయన పథకాలను తుంగలో తొక్కుతోందన్నారు. త్వరలోనే ప్రజలు కోరుకుంటున్నట్లుగా జగన్ వస్తాడని, వైయస్ ఎలా ఆదరించారో అలా ఆదరిస్తారన్నారు. జగన్కు వైయస్లా మంచి మనసుందన్నారు. ప్రజల గురించి జగన్ ఎప్పుడూ ఆలోచిస్తుంటారని షర్మిల అన్నారు.
మంగళవారం 190వ రోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని ఎ శరభవరం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి శృంగవరం, గాంధీనగరం, తాండవ కూడలి, ఎర్రవరం కూడలి, ములగపూడి మీదుగా బెన్నవరం చేరుకున్నారు. బెన్నవరం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. మంగళవారం మొత్తం 12.7 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,520.10 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది.