గంటి ప్రసాదంపై కాల్పులు, వేటకొడవళ్లతో దాడి: మృతి
దాడిలో ఆయనకు తీవ్రంగా గాయాలు కావడంతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. గంటి ప్రసాదం నెల్లూరుకు వస్తున్నాడని తెలిసి ముందస్తు వ్యూహంగానే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
కిరాయి గూండాలతో కలిసి పోలీసులే గంటి ప్రసాదంపై కాల్పులు జరిపించారని అమరవీరుల బంధుమిత్రుల కమిటీ మరో నేత పుష్మ ఆరోపించారు. కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులే ఇలా దాడి చేశారని వరవర రావు కూడా ఆరోపించారు. ప్రభుత్వం హింసాత్మక చర్యలకు పూనుకోవడం సరికాదన్నారు.
కాగా నిందితులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి అంజమ్మ తెలిపారు. ఒకరు వేట కొడవలితో దాడి చేశారన్నారు. దుండగుల మొహానికి మాస్కులు ఏమీ లేవన్నారు. గంటి ప్రసాదం అంతకుముందు ఉదయం నెల్లూరులో జరిగిన విరసం సభలో పాల్గొన్నారు.