సోనియాతో భేటీ: ప్రక్రియ స్తంభనపై పళ్లంరాజు ఆశ

వారు గంటకుపైగా సోనియాతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం పళ్లంరాజు మీడియా ప్రతినిధులతో చెప్పారు. కమిటీకి సమస్యలు వినిపించాలని సోనియా చెప్పారని పళ్లంరాజు అన్నప్పుడు ప్రక్రియ ఆగుతుందా అని మీడియా ప్రతినిధులు అడిగారు. ఆగుతుందని పళ్లంరాజు సమాధానమిచ్చారు.
తమ ప్రాంతంలోని ఆందోళనను సోనియాకు వివరించామని ఆయన అన్నారు. ఒక ప్రాంతానికి పరిష్కారం చూపించారని, తమకు అన్యాయం జరుగుతుందనే భావన సీమాంధ్రలో నెలకొని ఉందని చెప్పామని ఆయన అన్నారు. కమిటీని ప్రకటిస్తాం, ఆ కమిటీ ముందు అన్ని విషయాలూ చెప్పండని సోనియా సూచించినట్లు ఆయన తెలిపారు. అన్యాయం ఎక్కడ జరుగుతుందో చెప్పాలని, వాటిని పరిశీలిస్తామని సోనియా చెప్పినట్లు ఆయన అన్నారు.
న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. ప్రశాంతంగా ఉండాలని ఆయన సీమాంధ్ర ప్రజలకు ఆయన విజ్ఝప్తి చేశారు. సంయమనం పాటించాలని సోనియా సూచించినట్లు ఆయన తెలిపారు. అన్ని వర్గాలకూ సమన్యాయం జరగుతుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన ఏకపక్షం అవుతుందనే బాధ అక్కర్లేదని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. సీమాంధ్రకు చెందిన ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారని సోనియాకు చెప్పామని, అపోహలన్నింటినీ కమిటీకి చెప్పాలని సూచించారని ఆయన అన్నారు. హైదరాబాదును శాశ్వత రాజధానిగా ఉంచాలని కమిటీకి చెప్తామని, తమ కోరిక నెరవేరుతుందనే ఆశతో ఉన్నామని ఆయన అన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications