కోస్తాను వణికిస్తున్న తుఫాను : తీవ్ర తుఫానుగా పెథాయ్
Recommended Video

కోస్తాంధ్ర మొత్తం 'పెథాయ్'తో వణుకుతోంది. రాత్రి నుండి కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అన్ని జిల్లాల్లో నూ అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసారు. పునరావాస శిబిరాలు సిద్దం అయ్యాయి. సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణశాఖ, యానాం-తుని మధ్య తీరం దాటుతుందని ఆర్టీజీఎస్, ఇస్రో నిపుణులు అంచనా వేస్తున్నారు.
పెథాయ్ తుఫాను తీరం దిశగా దూసుకొస్తోంది. ఎక్కడ తీరం దాటుతుందనే అంశంపై వాతావరణ శాఖ..ఆర్టీజిఎస్ లు అధికారులను అలర్ట్ చేసాయి. ఏడు జిల్లాల పై ప్రధాన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ జిల్లాల అధికా రులను ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అన్ని రకాలుగా సిద్దంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. తీరం తాకే సమయా నికి గాలుల తీవ్రత తగ్గుతుందని తొలుత భావించినప్పటికీ... ఆ అంచనా మారిపోయింది. అంతకుముందు గంటకు 14-15కి.మీ. వేగంతో కదిలిన తుఫాను తర్వాత 26కి.మీ. వేగం పుంజుకుంది. దీంతో తీరం వెంబడి గంటకు 50-60కి.మీ.

వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్ తీరందాటే సమయానికి గంటకు 100కి.మీ. వేగంతో గాలులు వీయవచ్చని, ఊహించిన దానికంటే ఎక్కువ నష్టమే కలిగించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే తీర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు కార్యక్రమం మొదలైంది
రాత్రి నుండి ఏడు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది పాటి గాలులు వీస్తుండగా..తీర ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువ గా కనిపిస్తోంది. ఇక, థాయ్ తుఫాన్ తీవ్ర తుఫాన్గా మారింది. రాత్రి మచిలీపట్నానికి 380, కాకినాడకు 410కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నందున ఈ ఉదయం నుంచి క్రమేపీ బలహీనపడి, సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణశాఖ, యానాం-తుని మధ్య తీరం దాటుతుందని ఆర్టీజీఎస్, ఇస్రో నిపుణులు అంచనా వేస్తున్నారు. సోమవారం రాత్రి లేదా మంగళవారానికి తుఫాన్ బలహీనపడుతుం దని భావిస్తున్నారు. దీని ప్రభావంతో సోమవారం గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని అక్కడక్కడ 20సెం.మీ. మేర వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కాకి నాడ, భీమునిపట్నం ఓడరేవులో ఏడు, విశాఖపట్నం, గంగవరంలో ఆరు, మచిలీ పట్నం, నిజాంపట్నంలో ఐదో నం బరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. ఇదే సమయంలో ఏడు జిల్లాల అధికారులతో ముఖ్యమంత్రి టెలి కాన్పిరెన్స్ నిర్వహించారు. అప్రమత్తతో వ్యవహరించాలని ఆదేశించారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications