శ్రీవారి భక్తులకు తీపి కబురు: సిఫార్సు లేకుండానే 10లడ్డూలు
తిరుపతి: తిరుమల శ్రీవారి భక్తులకు ఇది ఖచ్చితంగా తీపి కబురే. ఎందుకంటే.. ఇప్పటివరకూ రెండు లడ్డూలు మాత్రమే ఇస్తుండగా ఇకపై అదనంగా 10 లడ్డూల వరకు ఇవ్వనున్నారు.
భక్తులకు కోరినన్ని లడ్డూలు అందజేయాలన్న లక్ష్యంతో ఇటీవల లడ్డూల తయారీని పెంచడంతో దాదాపు 7లక్షల లడ్డూలు నిల్వ ఏర్పడ్డాయి. ఈ కారణంగా మంగళవారం నుంచి ఎటువంటి సిఫారసు లేకుండా భక్తుడు కోరితే 6 లడ్డూల వరకు ఇస్తున్నారు.

కోరితే 10లడ్డూలు
అయితే బుధవారం కూడా కోటా మిగిలే పరిస్థితి రావడంతో జేఈవో శ్రీనివాసరాజు సీనియర్ అధికారులతో చర్చించి భక్తుడు కోరితే 10 లడ్డూల వరకు ఇవ్వాలని సంబంధిత విభాగాన్ని ఆదేశించారు. దీంతో బుధవారం మధ్యాహ్నం నుంచి రూ.50 చొప్పున భక్తులకు 10 లడ్డూల వరకు జారీచేశారు.

ఇకపై కూడా..
అంతేగాక, ఇకపై భక్తులకు ఎటువంటి సిఫారసు లేకుండా ఒక్కొక్కరికి 10 లడ్డూలు అందించనున్నారు. కాగా, శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 18న దివ్యప్రబంధ అధ్యయనోత్సవాలు గురువారం ముగియనున్నాయి.

తిరుమలలో వేడుకలు
మరోవైపు కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో జనవరి 16వ తేదీన పార్వేట ఉత్సవం కన్నుల పండువగా జరుగనుంది. అదేరోజు సాయంత్రం గోదా పరిణయోత్సవం నిర్వహిస్తారు.

ఇటీవల పెరిగిన లడ్డూల ధరలు
కాగా, ఇటీవల టీటీడీ.. లడ్డూ ధర రూ.50, కళ్యాణోత్సవం లడ్డూ ధర రూ.200, వడ ధర రూ.100గా నిర్ణయించింది. అయితే, ఈ ధరలు సిఫార్సు లేఖలపై జారీ చేసే ప్రసాదాలకు మాత్రమే వర్తిస్తాయి.
-
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్












Click it and Unblock the Notifications