ప్రాణం తీసిన పేదరికం: ముగ్గురు కుమారులతో ఉప్పుటేరులో దూకి వివాహిత ఆత్మహత్య
తూర్పుగోదావరి: జిల్లాలోని కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద అమరవిల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. తన ముగ్గురు కుమారులతో కలిసి ఓ వివాహిత ఉప్పాడ ఉప్పుటేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఇద్దరు కుమారులు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తీవ్ర మనస్తాపానికి గురై ఆ తల్లి ఈ తీవ్ర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వారికి వైద్యం అందించలేని పేదరికం కూడా ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మృతి చెందిన వారిలో తల్లి భూలక్ష్మి(45), కుమారులు ప్రేమ్కుమార్(22), అనిల్కుమార్(21), ప్రభుదాస్(20) ఉన్నారు. మొదట పురుగుల మందు తాగి కాళ్లకు తాళ్లు, రాళ్లు కట్టుకుని ఉప్పుటేరులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతదేహాలను బయటికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
విశాఖపట్నం: గురువారం విశాఖ జిల్లా కంచరపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరుకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications