ప్రాణం తీసిన పేదరికం: ముగ్గురు కుమారులతో ఉప్పుటేరులో దూకి వివాహిత ఆత్మహత్య
తూర్పుగోదావరి: జిల్లాలోని కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద అమరవిల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. తన ముగ్గురు కుమారులతో కలిసి ఓ వివాహిత ఉప్పాడ ఉప్పుటేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఇద్దరు కుమారులు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తీవ్ర మనస్తాపానికి గురై ఆ తల్లి ఈ తీవ్ర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వారికి వైద్యం అందించలేని పేదరికం కూడా ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మృతి చెందిన వారిలో తల్లి భూలక్ష్మి(45), కుమారులు ప్రేమ్కుమార్(22), అనిల్కుమార్(21), ప్రభుదాస్(20) ఉన్నారు. మొదట పురుగుల మందు తాగి కాళ్లకు తాళ్లు, రాళ్లు కట్టుకుని ఉప్పుటేరులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతదేహాలను బయటికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
విశాఖపట్నం: గురువారం విశాఖ జిల్లా కంచరపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరుకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications