చెట్టుకొమ్మ విరిగిపడి.. గొంతులోకి దూసుకెళ్లి!: విజయవాడలో విషాదం.. బాలుడి మృతి
మృతి చెందిన హర్ష స్థానికంగా 8వ తరగతి చదువుతుండగా.. ఘటన జరిగిన చాలాసేపటికి గానీ స్థానికులెవరూ దాన్ని గుర్తించకపోవడం గమనార్హం.
విజయవాడ: విజయవాడ సత్యనారాయణపురంలో విషాదం చోటు చేసుకుంది. ఉదయాన్నే పాల ప్యాకెట్ కోసమని బయలుదేరిన హర్ష అనే బాలుడిని మృత్యువు కబళించింది. స్థానిక శిశు శిశ్యామందిర్ వద్ద చెట్టుకొమ్మ విరిగి మీద పడటంతో.. బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు.. చెట్టు నానిపోయి ఉండటం.. ఈదురుగాలులకు వంగిపోయిన ఓ కొమ్మ.. అకస్మాత్తుగా బాలుడి మీద పడటంతో హర్ష అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు. చెట్టు కొమ్మ హర్ష గొంతులోకి దూసుకెళ్లడంతో స్పాట్లో మరణించినట్లు తెలుస్తోంది.

మృతి చెందిన హర్ష స్థానికంగా 8వ తరగతి చదువుతుండగా.. ఘటన జరిగిన చాలాసేపటికి గానీ స్థానికులెవరూ దాన్ని గుర్తించకపోవడం గమనార్హం. మరోవైపు హర్ష తల్లి కొంత అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో.. బాలుడి మృతి గురించి ఇప్పటివరకు ఆమెకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
More From
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications