చెట్టుకొమ్మ విరిగిపడి.. గొంతులోకి దూసుకెళ్లి!: విజయవాడలో విషాదం.. బాలుడి మృతి
మృతి చెందిన హర్ష స్థానికంగా 8వ తరగతి చదువుతుండగా.. ఘటన జరిగిన చాలాసేపటికి గానీ స్థానికులెవరూ దాన్ని గుర్తించకపోవడం గమనార్హం.
విజయవాడ: విజయవాడ సత్యనారాయణపురంలో విషాదం చోటు చేసుకుంది. ఉదయాన్నే పాల ప్యాకెట్ కోసమని బయలుదేరిన హర్ష అనే బాలుడిని మృత్యువు కబళించింది. స్థానిక శిశు శిశ్యామందిర్ వద్ద చెట్టుకొమ్మ విరిగి మీద పడటంతో.. బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు.. చెట్టు నానిపోయి ఉండటం.. ఈదురుగాలులకు వంగిపోయిన ఓ కొమ్మ.. అకస్మాత్తుగా బాలుడి మీద పడటంతో హర్ష అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు. చెట్టు కొమ్మ హర్ష గొంతులోకి దూసుకెళ్లడంతో స్పాట్లో మరణించినట్లు తెలుస్తోంది.

మృతి చెందిన హర్ష స్థానికంగా 8వ తరగతి చదువుతుండగా.. ఘటన జరిగిన చాలాసేపటికి గానీ స్థానికులెవరూ దాన్ని గుర్తించకపోవడం గమనార్హం. మరోవైపు హర్ష తల్లి కొంత అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో.. బాలుడి మృతి గురించి ఇప్పటివరకు ఆమెకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
More From
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications