షాక్: ఎంపీ మాగంటి ఆఫీసులోనే పేకాట దందా, కోట్లలో వ్యాపారం
కృష్ణా: జిల్లాలోని కైకలూరులో పేకాట దందా జోరుగా సాగుతోంది. ఏకంగా అధికార టీడీపీ ఎంపీ మాగంటి బాబు కార్యాలయంలో ఈ దందా సాగుతుండటం గమనార్హం. పేకాటలో ఓడిపోయిన వారి నుంచి ఆస్తులు రాయించుకుని ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారని తెలిసింది.
కోట్ల రూపాయల్లో నడుస్తున్న ఈ వ్యవహారంలో మందు, విందు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ఎంపీ మాగంటి బాబు కార్యాలయంలో.. ఆయన అండతోనే ఈ దందా జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బయటి వ్యక్తులకు అనుమానం రాకుండా తమ వాహనాలను పేకాట ఆడే ప్రాంతానికి దూరంగా పార్కింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వారానికే కోట్ల రూపాయల్లో సాగే ఈ దందాలో పింక్, ఎల్లో, గ్రీన్ కాయిన్స్నే డబ్బు పరిగణిస్తున్నారని సమాచారం. కాగా, నాలుగు రోజుల క్రితం మాగంటి బాబు ఇక్కడికి వచ్చి వెళ్లినట్లు తెలిసింది.
క్రికెట్ బుకీలు, ఫైనాన్స్ నిర్వహించే వ్యక్తులు సహా ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన పేకాట రాయుళ్లు ఇక్కడికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఈ పేకాట దందా వీడియోలు బయటికి రావడంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఇప్పటివరకు ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications