షాక్: ఎంపీ మాగంటి ఆఫీసులోనే పేకాట దందా, కోట్లలో వ్యాపారం
కృష్ణా: జిల్లాలోని కైకలూరులో పేకాట దందా జోరుగా సాగుతోంది. ఏకంగా అధికార టీడీపీ ఎంపీ మాగంటి బాబు కార్యాలయంలో ఈ దందా సాగుతుండటం గమనార్హం. పేకాటలో ఓడిపోయిన వారి నుంచి ఆస్తులు రాయించుకుని ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారని తెలిసింది.
కోట్ల రూపాయల్లో నడుస్తున్న ఈ వ్యవహారంలో మందు, విందు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ఎంపీ మాగంటి బాబు కార్యాలయంలో.. ఆయన అండతోనే ఈ దందా జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బయటి వ్యక్తులకు అనుమానం రాకుండా తమ వాహనాలను పేకాట ఆడే ప్రాంతానికి దూరంగా పార్కింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వారానికే కోట్ల రూపాయల్లో సాగే ఈ దందాలో పింక్, ఎల్లో, గ్రీన్ కాయిన్స్నే డబ్బు పరిగణిస్తున్నారని సమాచారం. కాగా, నాలుగు రోజుల క్రితం మాగంటి బాబు ఇక్కడికి వచ్చి వెళ్లినట్లు తెలిసింది.
క్రికెట్ బుకీలు, ఫైనాన్స్ నిర్వహించే వ్యక్తులు సహా ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన పేకాట రాయుళ్లు ఇక్కడికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఈ పేకాట దందా వీడియోలు బయటికి రావడంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఇప్పటివరకు ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications