అరాచకాల అడ్డా 'నారాయణ', ఇంత కండకావరమా: బాబుపై బాధ్యత వేసిన రోజా
నారాయణ విద్యాసంస్థల్లో వరుసగా విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసిపి ఎమ్మెల్యే రోజా శనివారం నిప్పులు చెరిగారు.
అమరావతి: నారాయణ విద్యాసంస్థల్లో వరుసగా విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసిపి ఎమ్మెల్యే రోజా శనివారం నిప్పులు చెరిగారు.
మూడున్నరేళ్లలో దాదాపు 30 మంది విద్యార్థులు చనిపోయినా సీఎం చంద్రబాబు, విద్యా సంస్థల అధినేత నారాయణతో పాటు మంత్రి గంటా శ్రీనివాస రావు స్పందించలేదని ఆరోపించారు.

అందుకే చర్యలు తీసుకోవడం లేదు
నారాయణ కాలేజీలు అంటే నరకానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాయని రోజా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నారాయణ బినామీ అని, అలాగే విద్యాశాఖ మంత్రి గంటాకు వియ్యంకుడు అని అందుకే చర్యలు తీసుకోవడం లేదన్నారు. అధికారం తమదే అని, ఎవరూ తమను ఏం చేయలేరనే కండకావరంతో వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

బాబుకు ఆడపిల్లల విలువ తెలియదు
ఒకే విద్యా సంస్థలో ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నా ఎలాంటి కేసు గానీ, కనీసం విచారణ గానీ చేపట్టడం లేదని రోజా అన్నారు. విద్యార్థుల ప్రాణాలు పోతుంటే చోద్యం చూస్తున్నారే గానీ ఎలాంటి చర్యల్లేవన్నారు. చంద్రబాబుకు ఆడపిల్లల విలువ తెలియదని, టిడిపి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఏ ఏడాదికి ఆ ఏడాది నేరాలు పెరుగుతూనే ఉన్నాయన్నారు.

అరాచకాలకు అడ్డగా నారాయణ
నేరాలు పెరుగుతున్నాయని స్వయంగా డిజిపినే వెల్లడించారని రోజా అన్నారు. కళ్లు, నోరు కుట్టేసుకున్న ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత, ఊడితే ఎంత అన్నారు. నారాయణ కాలేజీలు టిడిపి ప్రాంగణాలుగా మారాయన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బులు పంపించేందుకు, వారి అరాచకాలను అడ్డాగా ప్రతి చోట ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు.

ఆ బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది
ప్రభుత్వ పెద్దలకు మానవత్వం ఉంటే, మీరు ఏ తప్పు చేయలేదని భావిస్తే సిబిఐ విచారణకు ముందుకు రావాలని రోజా చంద్రబాబును డిమాండ్ చేశారు. ఇన్ని చావులకు కారణమైన నారాయణ, గంటాలను బర్తరఫ్ చేయాలన్నారు. ఇక మీదట రాష్ట్రంలో అక్రమంగా నడుస్తున్న నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఏ విద్యార్థి హత్య, ఆత్మహత్య జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీఎం పైన ఉందన్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications