అరాచకాల అడ్డా 'నారాయణ', ఇంత కండకావరమా: బాబుపై బాధ్యత వేసిన రోజా
నారాయణ విద్యాసంస్థల్లో వరుసగా విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసిపి ఎమ్మెల్యే రోజా శనివారం నిప్పులు చెరిగారు.
అమరావతి: నారాయణ విద్యాసంస్థల్లో వరుసగా విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసిపి ఎమ్మెల్యే రోజా శనివారం నిప్పులు చెరిగారు.
మూడున్నరేళ్లలో దాదాపు 30 మంది విద్యార్థులు చనిపోయినా సీఎం చంద్రబాబు, విద్యా సంస్థల అధినేత నారాయణతో పాటు మంత్రి గంటా శ్రీనివాస రావు స్పందించలేదని ఆరోపించారు.

అందుకే చర్యలు తీసుకోవడం లేదు
నారాయణ కాలేజీలు అంటే నరకానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాయని రోజా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నారాయణ బినామీ అని, అలాగే విద్యాశాఖ మంత్రి గంటాకు వియ్యంకుడు అని అందుకే చర్యలు తీసుకోవడం లేదన్నారు. అధికారం తమదే అని, ఎవరూ తమను ఏం చేయలేరనే కండకావరంతో వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

బాబుకు ఆడపిల్లల విలువ తెలియదు
ఒకే విద్యా సంస్థలో ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నా ఎలాంటి కేసు గానీ, కనీసం విచారణ గానీ చేపట్టడం లేదని రోజా అన్నారు. విద్యార్థుల ప్రాణాలు పోతుంటే చోద్యం చూస్తున్నారే గానీ ఎలాంటి చర్యల్లేవన్నారు. చంద్రబాబుకు ఆడపిల్లల విలువ తెలియదని, టిడిపి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఏ ఏడాదికి ఆ ఏడాది నేరాలు పెరుగుతూనే ఉన్నాయన్నారు.

అరాచకాలకు అడ్డగా నారాయణ
నేరాలు పెరుగుతున్నాయని స్వయంగా డిజిపినే వెల్లడించారని రోజా అన్నారు. కళ్లు, నోరు కుట్టేసుకున్న ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత, ఊడితే ఎంత అన్నారు. నారాయణ కాలేజీలు టిడిపి ప్రాంగణాలుగా మారాయన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బులు పంపించేందుకు, వారి అరాచకాలను అడ్డాగా ప్రతి చోట ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు.

ఆ బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది
ప్రభుత్వ పెద్దలకు మానవత్వం ఉంటే, మీరు ఏ తప్పు చేయలేదని భావిస్తే సిబిఐ విచారణకు ముందుకు రావాలని రోజా చంద్రబాబును డిమాండ్ చేశారు. ఇన్ని చావులకు కారణమైన నారాయణ, గంటాలను బర్తరఫ్ చేయాలన్నారు. ఇక మీదట రాష్ట్రంలో అక్రమంగా నడుస్తున్న నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఏ విద్యార్థి హత్య, ఆత్మహత్య జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీఎం పైన ఉందన్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications