వైఎస్ ఘనత: అవినాష్ రెడ్డిపై చంద్రబాబు ఆగ్రహం
కడప: అన్నీ వైయస్ రాజశేఖర రెడ్డి చేశారని అన్నందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో గండికోట, చిత్రావతి పనులు 85 శాతం పూర్తి అయ్యాయని అవినాష్ రెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 15 శాతం పనులు మాత్రమే చేసిందని ఆయన అన్నారు.

రాజకీయాలు వద్దని చంద్రబాబు
జన్మభూమి సభలో రాజకీయాలు మాట్లాడవద్దని చంద్రబాబు అవినాష్ రెడ్డికి సూచించారు. ఇది ప్రజా సభ అని, ఈ సభలో ఎవరు రాజకీయాలు మాట్లాడకూడదని, ఎవరి సభలు వారికుంటాయని, అక్కడ మాట్లాడుకోవాలని, ఇక్కడ గౌరంగా సమావేశం జరగాలని చంద్రబాబు అన్నారు.

గౌరవం నేర్చుకోవాలి...
ఈ ప్రాంతానికి ఇప్పుడు నీరు ఇచ్చింది తానేనని, ఈ విషయం కూడా ఇక్కడ చెప్పలేదని, గౌరవంగా ఉండడం నేర్చుకోవాలని చంద్రబాబు అవినాష్ రెడ్డితో అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వినతిపత్రం ఇవ్వాలని, పరిష్కరిస్తానని కూడా చెప్పారు.

ప్రోటోకాల్ ప్రకారం పిలిచారు..
కడప పులివెందులలో బుధవారంనాడు జరిగిన జన్మభూమి కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం అవినాష్ రెడ్డిని అధికారులు పిలిచారు. ఆయనకు తొలుత మైకు ఇవ్వకపోవడంతో అవినాష్ అనుచరులు నిరసన తెలిపారు. దీంతో అధికారులు అవినాష్కు మైకు ఇచ్చారు. మైకు ఇచ్చే ముందు రాజకీయాలు మాట్లాడవద్దని, కేవలం సమస్యలపైనే మాట్లాడాలని కూడా చెప్పారు.

ఇవి చంద్రబాబు చేసినవి కావు...
ముఖ్యమంత్రి ప్రారంభించిన గండికోట, చిత్రవాతి ఎత్తిపోతల పథకం చంద్రబాబు చేసిన పనికాదని, గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించి 85 శాతం పనులు పూర్తి చేశారని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం 15 శాతం మాత్రమే పనులు చేసిందని ఆయన అన్నారు. దీంతో చంద్రబాబు జోక్యం చేసుకుని ఇక్కడ రాజకీయం మాట్లాడకూడదని అన్నారు.

హార్టీకల్చర్ హబ్గా
రాయలసీమ హార్టికల్చర్ హబ్గా మారుతుందని చంద్రబాబు అన్నారు. రాయలసీమలో ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆర్థికలోటు ఉన్నా రైతు రుణమాఫీ చేశామని అన్నారు. తనది ఉడుంపట్టు, అనుకున్నది సాధించి తీరుతానని చంద్రబాబు చెప్పారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications