ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకింది?...సిఎం చంద్రబాబు వ్యాఖ్యలపై కలకలం
కర్నూలు:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకిందని మీడియా సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించడం పై దుమారం రేగింది.
గురువారం కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఓర్వకల్ వద్ద జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన పారిశ్రామివేత్తల-మీడియా సమావేశంలో కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నలపై తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రంగా స్పందించారు.

టిడిపి ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమయ్యిందంటూ ప్రతిపక్షాలు అరోపిస్తున్నాయని ఓ మీడియా ప్రతినిధి చంద్రబాబును అడగగా...ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు..."ప్రతిపక్షం వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు. చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదా...కేసుల మాఫీ కోసం భారతీయ జనతా పార్టీతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు"...అంటూ పరుషమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత మీడియా సమావేశం అర్థాంతరంగా ముగించి వెళ్లిపోయారు.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై ఖంగుతిన్న మీడియా ప్రతినిధులు సిఎం వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోలేక గందరగోళంలో పడిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షంగా వైసిపిని అభివర్ణించి ఉంటే ఆ పార్టీ ఎప్పుడూ అధికారంలోకి రాలేదు కాబట్టి...ఆ వ్యాఖ్యలు వర్తించే అవకాశం లేదు. పోనీ కాంగ్రెస్ ను ఆయన ప్రతిపక్షంగా భావించి ఉంటే ఆ పార్టీ బిజెపితో కలసి లాలూచీ రాజకీయాలు చేసే అవకాశమే లేదు.
అయితే మొత్తం మీద చంద్రబాబు బిజెపితో లాలూచీ అనే పదం వాడారు కాబట్టి ఆ వ్యాఖ్యలు వైసిపిని ఉద్దేశించే అన్నారని అర్థం చేసుకోవాలని మీడియా వారు విశ్లేషించుకున్నారు. అయితే వైసిపి అధికారంలో ఉండటం అంటే వైఎస్ జగన్ తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కాబట్టి ఆయన అధికారంలో ఉన్న సమయమని అర్థం చేసుకోవాలేమో నని తమలో తాము చర్చించుకున్నారు. అయినప్పటికీ ఎంత ఆవేశంలోనైనా మాటలు జాగ్రత్తగా మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కసారిగా అంత ఆగ్రహానికి లోనై ఆ విధంగా మాట్లాడటం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications