ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకింది?...సిఎం చంద్రబాబు వ్యాఖ్యలపై కలకలం
కర్నూలు:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకిందని మీడియా సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించడం పై దుమారం రేగింది.
గురువారం కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఓర్వకల్ వద్ద జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన పారిశ్రామివేత్తల-మీడియా సమావేశంలో కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నలపై తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రంగా స్పందించారు.

టిడిపి ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమయ్యిందంటూ ప్రతిపక్షాలు అరోపిస్తున్నాయని ఓ మీడియా ప్రతినిధి చంద్రబాబును అడగగా...ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు..."ప్రతిపక్షం వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు. చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదా...కేసుల మాఫీ కోసం భారతీయ జనతా పార్టీతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు"...అంటూ పరుషమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత మీడియా సమావేశం అర్థాంతరంగా ముగించి వెళ్లిపోయారు.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై ఖంగుతిన్న మీడియా ప్రతినిధులు సిఎం వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోలేక గందరగోళంలో పడిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షంగా వైసిపిని అభివర్ణించి ఉంటే ఆ పార్టీ ఎప్పుడూ అధికారంలోకి రాలేదు కాబట్టి...ఆ వ్యాఖ్యలు వర్తించే అవకాశం లేదు. పోనీ కాంగ్రెస్ ను ఆయన ప్రతిపక్షంగా భావించి ఉంటే ఆ పార్టీ బిజెపితో కలసి లాలూచీ రాజకీయాలు చేసే అవకాశమే లేదు.
అయితే మొత్తం మీద చంద్రబాబు బిజెపితో లాలూచీ అనే పదం వాడారు కాబట్టి ఆ వ్యాఖ్యలు వైసిపిని ఉద్దేశించే అన్నారని అర్థం చేసుకోవాలని మీడియా వారు విశ్లేషించుకున్నారు. అయితే వైసిపి అధికారంలో ఉండటం అంటే వైఎస్ జగన్ తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కాబట్టి ఆయన అధికారంలో ఉన్న సమయమని అర్థం చేసుకోవాలేమో నని తమలో తాము చర్చించుకున్నారు. అయినప్పటికీ ఎంత ఆవేశంలోనైనా మాటలు జాగ్రత్తగా మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కసారిగా అంత ఆగ్రహానికి లోనై ఆ విధంగా మాట్లాడటం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications