కాంగ్రెస్కు షాక్: వైసీపీలో చేరిన రాకేష్రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి రాకేష్రెడ్డి షాకిచ్చారు. 2014 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన రాకేష్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం నాడు వైసీపీలో చేరారు
నంద్యాల:: కాంగ్రెస్ పార్టీకి రాకేష్రెడ్డి షాకిచ్చారు. 2014 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన రాకేష్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం నాడు వైసీపీలో చేరారు.
నంద్యాల: మూడేళ్ళలో తీవ్రపోటీ, సెంటిమెంట్ అస్త్రంతో భూమా, బిసి కార్డుతో కాంగ్రెస్
నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డితో కలిసి ఆయన వైసీపీ చీఫ్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వచ్చే నెల 23వ, తేదిన నంద్యాల అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది.
అయితే ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాకేష్రెడ్డి ఆ పార్టీని వీడడం ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. 2014 ఎన్నికల సమయంలో మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేశారు.
అయితే ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడ తన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తోంది. ఆ సమయంలోనే రాకేష్రెడ్డి వైసీపీలో చేరడం కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బందుల్లో నెట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.