కిషోర్ వాహనంపై రెబల్ వర్గం దాడి, జగన్ నామినేషన్
హైదరాబాద్: కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ వాహనాన్ని అరకులో రెబల్ వర్గం కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. రెబల్ వర్గం దాడిలో కిషోర్ చంద్రదేవ్ కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘర్షణలో పోలీసులకు గాయాలయ్యాయి. లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. కిషోర్ నామినేషన్ దాఖలు చేసిన ్ అనంతరం తన కారు పైన జరిగిన దాడిని ఈసి దృష్టికి తీసుకు వెళ్లారు.
జగన్ నామినేషన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరారు. దీంతో పులివెందుల పట్టణం జనసంద్రమైంది. జగన్ నామినేషన్ కార్యక్రమానికి అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జగన్ పైన పూలవర్షం కురిపించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి రాగానే వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అమలులోకి తెస్తామన్నారు. అంతకుముందు ఇడుపులపాయ వద్ద తండ్రి వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు. జగన్ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఇచ్చారు. పులివెందుల అసెంబ్లీకి జగన్ పోటీ చేస్తున్నారు.
బిజెపి అభ్యర్థులపై గంటా
సీమాంధ్రలో బిజెపి అభ్యర్థుల ఎంపిక సరిగా లేదని టిడిపి నేత గంటా శ్రీనివాస రావు విశాఖలో అన్నారు. తమ రెండు పార్టీల మధ్య పొత్తు రద్దైతే విశాఖ నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించిందన్నారు. అధికారికంగా పొత్తు రద్దైతే పార్టీలోని ముఖ్యనేతలతో చర్చించి తన నిర్ణయం ప్రకటిస్తానని గంటా తెలిపారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications