ఏపీలో రాజ్యాంగం అమలౌతోందా: రోజా ఇష్యూపై చంద్రబాబు మీద జేపీ గరం
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం అమలౌతోందా అని లోక్ సత్తా వ్యవస్థాప అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అనుమానాన్ని వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకొన్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు.
అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం అమలౌతోందా అని లోక్ సత్తా వ్యవస్థాప అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అనుమానాన్ని వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకొన్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు.
ప్రత్యేక హోదా డిమాండ్ తో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ విశాఖలో జరిగే క్యాండిల్ ర్యాలీ లో పాల్గొనేందుకు వెళ్తే ఎయిర్ పోర్ట్ లోనే ఆయనను అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వైఎస్ఆర్ సిపి ఎంఏల్ఏ రోజాను గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే ప్రభుత్వం అడ్డుకోవడం సరైంది కాదన్నారు జయప్రకాష్ నారాయణ.

జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో మహిళ ఎంఏల్ఏ రోజాను పాల్గొనకుండా అడ్డుకోవడం సరైందికాదని ఆయన ఓ మీడియా చానల్ కు చెప్పారు. ప్రజా ప్రతినిధిని ఈ సమావేశంలో పాల్గొనకుండా అడ్డుకోవడం సరికాదన్నారాయన.
ఈ రకమైన ఘటనలు ముఖ్యమంతరికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరును తెస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతరులను కించపర్చేలా ప్రవర్తించారని భావిస్తే పరువు నష్టం దావా వేసుకొనే వెసులుబాటు ఉంటుందన్నారు.రాష్ట్రంలో పోలీసులు రాజభక్తిని ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications