'దివంగత నేత, ప్రియతమ నేత అనే అరిగిపోయిన రికార్డు ఇక ఆపెయ్ జగన్'
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మాను జగన్ 2014లోనే వాడేసుకున్నారని, ఇప్పటికీ ఇంకా అదే పేరును పెట్టుకుని వేలాడితే ప్రయోజనం ఉండదని విమర్శించారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా అసెంబ్లీ లాబీల్లో సందడి చేసిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రతిపక్ష అధినేత జగన్ మాట తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రస్తావించినప్పుడు జగన్ ఆయన్ను సంబోధించే తీరును జేసీ ఎద్దేవా చేశారు.
దివంగత నేత, ప్రియతమ నేత అనే అరిగిపోయిన రికార్డును జగన్ ఇక ఆపేయాలంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మాను జగన్ 2014లోనే వాడేసుకున్నారని, ఇప్పటికీ ఇంకా అదే పేరును పెట్టుకుని వేలాడితే ప్రయోజనం ఉండదని విమర్శించారు. ఏ ప్రాంతీయ పార్టీ అయిన ఆవిర్భవించిన తొలి ఎన్నికల్లోనే అధికారంలోకి రావాలని, లేనిపక్షంలో ఇక అధికారాన్ని దక్కించుకోవడం అసాధ్యమని అన్నారు.

కొత్త హామిలతో జగన్ జనం ముందుకెళ్తే ఏమైనా భవిష్యత్తు ఉండవచ్చునని జేసీ జగన్ కు సలహా కూడా ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఆస్తికి లోకేష్ ఎలా వారసుడో.. అలాగే ఆయన రాజకీయానికి కూడా లోకేష్ వారసుడని అన్నారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా లోకేష్ గెలవడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని ఈ సందర్బంగా జేసీ స్పష్టం చేశారు.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!












Click it and Unblock the Notifications